India Women History: టీ20 ప్రపంచకప్లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
- టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు చరిత్ర
- 200కు పైగా స్కోరు చేసిన రెండో జట్టుగా భారత్
- శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్కోర్ 219/1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Create T20 World Cup History With Record 209: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో 200కు పైగా స్కోరు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో నెదర్లాండ్స్పై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. భారత్ కంటే ముందు రెండుసార్లు ఇంగ్లండ్ ఈ ఘనత అందుకుంది.
2026లో ఎడ్జ్బాస్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 219/1 స్కోర్ చేసింది. 2023లో కేప్టౌన్ వేదికగా పాకిస్థాన్పై ఇంగ్లీష్ జట్టు 213/5 పరుగులు చేసింది. తాజాగా భారత్ 209 పరుగులు చేసి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 2020లో దక్షిణాఫ్రికా (థాయ్లాండ్-195/3), 2018లో భారత్ (న్యూజిలాండ్-194/5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్పై భారీ స్కోర్ చేయడమే కాదు.. 95 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
- Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harmanpreet Kaur: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. 'ఆ నలుగురు' వల్లే విజయం!
- ఫిఫా వరల్డ్కప్లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు స్మృతి మంధానా, షెఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 70 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు. మంధానా 47 బంతుల్లో 74 పరుగులు చేయగా, షెఫాలీ 38 బంతుల్లో 55 పరుగులతో మెరిశారు. పవర్ప్లేలోనే భారత్ 59 పరుగులు సాధించగా.. షెఫాలీ దూకుడైన బ్యాటింగ్తో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడింది. అనంతరం మంధానా కూడా వేగం పెంచి బౌండరీల వర్షం కురిపించింది. ముఖ్యంగా 15వ ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు బాది ప్రేక్షకులను అలరించింది. రిచా ఘోష్ (8 బంతుల్లో 20 పరుగులు), దీప్తి శర్మ (2 బంతుల్లో 10 పరుగులు) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లు:
219/1 – ఇంగ్లండ్ vs శ్రీలంక (ఎడ్జ్బాస్టన్, 2026)
213/5 – ఇంగ్లండ్ vs పాకిస్థాన్ (కేప్టౌన్, 2023)
209/5 – భారత్ vs నెదర్లాండ్స్ (హెడింగ్లీ, 2026)
195/3 – దక్షిణాఫ్రికా vs థాయ్లాండ్ (2020)
194/5 – భారత్ vs న్యూజిలాండ్ (2018)
తాజావార్తలు
-
India Women History: టీ20 ప్రపంచకప్లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!