India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
- సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా సూరీడు ఔట్
- టీమిండియా టీ20 కెప్టెన్గా సర్పంచ్ సాబ్
- చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New T20 Captain is Shreyas Iyer: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూరీడు.. జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా.. సూరీడి భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సూర్య ఫామ్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల అతడు పరుగుల చేసేందుకు ఇబ్బంది పడుతుండటం, ఐపీఎల్ 2026లో కూడా నిరాశపరిచే ప్రదర్శన చేయడం ఈ నిర్ణయానికి కారణం అని పేర్కొన్నాయి. ఐపీఎల్లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచే అయ్యర్కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
భారత జట్టులో కొత్త ఉత్సాహం తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నాడట. త్వరలోనే ‘సర్పంచ్ సాబ్’ టీమిండియా కొత్త కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. జట్టుకు తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు అందించడంతో పాటు తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 333 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే అతడిని మరలా భారత జట్టులోకి తీసుకొస్తోంది. శ్రేయస్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో కనీసం బ్యాటర్గా అయినా చోటు దక్కించుకుంటాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో సూర్యకుమార్ కొంతకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఆ నొప్పితోనే మ్యాచ్లు ఆడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కెప్టెన్గా సూరీడి రికార్డు అద్భుతంగా ఉన్నా.. బ్యాటర్గా తేలిపోవడమే అతడిపై వేటుకు కారణం అవుతుంది.
తాజావార్తలు
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత