భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా.. తొలి ఇన్నింగ్స్ను టీమిండియా 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆట డిక్లేర్ చేసే సమయానికి భారత్ 9 వికెట్లకు 285 పరుగులు చేసింది. దీంతో.. టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ ఇన్నింగ్స్లో యశస్వీ జైస్వాల్ (72), రోహిత్ శర్మ (23), శుభ్మన్ గిల్ (39), రిషబ్ పంత్ (9), విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (68), రవీంద్ర జడేజా (8), అశ్విన్ (1), ఆకాశ్ దీప్ (12), బుమ్రా (1) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్లో మెహిదీ హాసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఇద్దరు చెరో 4 వికెట్లు పడగొట్టారు. హసన్ మమూద్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఇన్నింగ్స్లో దూకుడు ఇన్నింగ్స్ ఆడిన భారత్.. పలు రికార్డులు సాధించింది. అయితే.. 16 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs BAN: రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆధిక్యంలో టీమిండియా
- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్
- 285 పరుగుల వద్ద భారత్ డిక్లేర్
- 52 పరుగుల ఆధిక్యంలో భారత్
- భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 285/9.