INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఎ సిరీస్ 2026 టోర్నమెంట్లో భారత్ ఎ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుపై భారత్ ఎ 101 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ, ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సరైన భాగస్వామ్యాలు లభించలేదు. అయితే ఈ దశలో ఫైసల్, బిహార్ జోడి భారత బౌలర్లను కాసేపు ప్రతిఘటించింది. వీరిద్దరూ నాలుగో వికెట్కు అత్యంత కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బిహార్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఫైసల్ కేవలం 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుని అవుట్ అయ్యాడు.
Also Read
- Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
- Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
- Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
- Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్పుట్లో స్వర్ణం
ఆఫ్ఘన్ జట్టుకు ఆశాకిరణంగా నిలిచిన ఈ భాగస్వామ్యం విడిపోవడంతో వారి బ్యాటింగ్ లైన్ అప్ పూర్తిగా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక క్రమశిక్షణతో వికెట్లు సమర్పించుకున్నారు. భారత కెప్టెన్ తిలక్ వర్మ సమయానుకూలంగా చేసిన బౌలింగ్ మార్పులు జట్టుకు అద్భుతంగా కలిసివచ్చాయి. ముఖ్యంగా భారత స్పిన్నర్ నిశాంత్ సింధు తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. నిశాంత్ సింధు చివరి వికెట్తో సహా మొత్తం నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్థాన్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమిష్టిగా రాణించిన భారత్ ఎ జట్టు ఈ మ్యాచ్ను ఏకపక్షంగా ముగించి అర్హత సాధించింది.
తాజావార్తలు
-
Nokia 250 4G Smart: నోకియా 250 4G స్మార్ట్ కొత్త ఫీచర్ ఫోన్.. 1,950 mAh బ్యాటరీ, AI ఫీచర్లు, డిజిటల్ పేమెంట్స్
-
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
-
Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
-
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!