PSL vs IPL: ఐపీఎల్ను విమర్శించినందుకు వసీం అక్రమ్కు పాకిస్థాన్ బహుమతి
- ఐపీఎల్పై పరోక్ష విమర్శలు చేసిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ ఆక్రమ్..
- పీఎస్ఎల్ 34 రోజులు జరిగితే, ఇతర లీగ్స్ పిల్లలు పెద్దవాళ్లైన ముగియదన్నారు..
- వసీమ్ అక్రమ్కు పీఎస్ఎల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL vs IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విమర్శించిన పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద బాధ్యతలు అప్పగించింది. రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సీజన్కు వసీమ్ అక్రమ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇది పీఎస్ఎల్ చరిత్రలో అక్రమ్కు ఇదే తొలిసారి. ఇటీవల లండన్లో జరిగిన పీఎస్ఎల్ ఈవెంట్లో మాట్లాడిన వసీమ్ అక్రమ్.. ఐపీఎల్పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. “పీఎస్ఎల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం 34 రోజులు మాత్రమే జరుగుతుంది. మూడు నెలలు సాగే ఇతర లీగ్ల వలే కాదు.. పిల్లలు పెద్దవాళ్లు అవుతారు కానీ, ఆ లీగ్ మాత్రం ముగియదు అంటూ ఐపీఎల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, వసీమ్ అక్రమ్ 2009 నుంచి 2016 వరకు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు బౌలింగ్ కోచ్గా పని చేశారు. ఆయన కోచింగ్లోనే కేకేఆర్ 2012, 2014 సంవత్సరాల్లో రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. అయితే, 2017 ఐపీఎల్కు ముందు అక్రమ్ కేకేఆర్ను వీడగా, అప్పటి నుంచి ఐపీఎల్కు దూరంగానే ఉన్నారు.
Read Also: Nidhhi Agerwal : పవన్–ప్రభాస్ మల్టీస్టారర్పై కన్నేసిన నిధి అగర్వాల్..
Also Read
- Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
అయితే, ఈసారి పీఎస్ఎల్, ఐపీఎల్తో పోటీ పడబోతుంది. పీఎస్ఎల్ 2026 మార్చి 23 నుంచి మే తొలి వారం వరకు కొనసాగనుంది. అదే సమయంలో మార్చి 26 నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహించనున్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్గా గుర్తింపు పొందిన ఐపీఎల్కు ఇది మరో భారీ సీజన్ కానుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరిగింది.
ఇక, 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల వారు మళ్లీ ఐపీఎల్లో ఆడలేదు.. అయితే, మాజీ పాకిస్థాన్ ఆల్రౌండర్ అజర్ మహ్మద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్లో పాల్గొ్న్నాడు. ఇక, పీఎస్ఎల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఆ లీగ్లో పాల్గొనలేదు. భారత క్రికెటర్లకు విదేశీ లీగ్ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే, రిటైర్డ్ క్రికెటర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్లలో పాల్గొనవచ్చు. ఐపీఎల్ పై చేసిన విమర్శలతో వసీం అక్రమ్ నను పీఎస్ఎల్ బ్రాండ్ అంబాసిడర్గా నియామకం మరింత చర్చకు దారి తీసింది.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!