ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సూపర్ 12 స్టేజ్ రేపటి నుండి ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ఈ టోర్నీలో విజయం సాధించడంలో ఓ స్పిన్నర్ దే ముఖ్య పాత్ర అవుతుంది అన్నాడు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా జరిగిన ఐపీఎల్ 2021 లీగ్ లోని మ్యాచ్ ల విజయాలలో స్పిన్నర్లే ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు భారత జట్టు చేయగలిగితే బౌలర్లు దానిని కట్టాడు చేయగలని అని అన్నాడు. ఇక భారత విజయాలలో స్పిన్నర్లే ముఖ్య పాత్ర పోషిస్తారు అని కుడా తెలిపాడు. ఇక ఐపీఎల్ 2021 లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు చేరుకోవడంలో స్పిన్నర్లు ముఖ్య పాత్ర పోషించారని హర్భజన్ తెలిపాడు.