Team India vs Gambhir: 17 ఏళ్ల తర్వాత అడిలైడ్లో ఓడిన భారత్.. బెడిసికొట్టిన గంభీర్ చెత్త ప్లాన్!
- అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్..
- 17 ఏళ్ల తర్వాత అడిలైడ్ స్టేడియంలో ఓడిన టీమిండియా..
- గంభీర్ చెత్త వ్యూహాలతోనే భారత్ వరుస ఓటములు అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India vs Gambhir: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. రెండో వన్డేలో మెరుగైన బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్కు నిరాశే మిగిలింది. 265 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే పెవిలియన్ కి వెళ్లారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) కాసేపు దూకుడుగా ఆడి బౌలర్లపై ఒత్తిడి తెవడానికి ప్రయత్నించారు. రెన్ షా అవుట్ అయ్యాక బ్యాటింగ్కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇక, మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలించాడు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
Also Read
- PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
- Vaibhav Sooryavanshi: "వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే".. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
అయితే, అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) హాఫ సెంచరీలు సాధించగా.. అక్షర్ పటేల్ (44) రాణించాడు. కాగా అడిలైడ్లో భారత్ ఒక వన్డే మ్యాచ్లో ఓడిపోవడం మొదటిసారి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.
Read Also: Kurnool Bus Accident: క్షణాల్లో కుటుంబం మొత్తం సజీవ దహనం.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృత్యువాత..
కాగా, పిచ్ కండీషన్స్ కు తగినట్లు ఆస్ట్రేలియా మెనెజ్మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్ను పక్కన పెట్టి మరీ స్పిన్నర్ ను తీసుకుంటే, భారత్ మాత్రం ముగ్గురు ఆల్రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్ ఆడింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకుని ఏకంగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అయితే, అడిలైడ్లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇలాంటి వికెట్పై కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కానీ, గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్లో కుల్దీప్ను బెంచ్ కే పరిమితం చేశాడు. బ్యాటింగ్ డెప్త్ను కారణంగా చూపిస్తూ.. కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా తరపున ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లు సుందర్, అక్షర్, నితీన్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అలాగే, ఇరు జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది.
తాజావార్తలు
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!