Team India vs Gambhir: 17 ఏళ్ల తర్వాత అడిలైడ్లో ఓడిన భారత్.. బెడిసికొట్టిన గంభీర్ చెత్త ప్లాన్!
- అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్..
- 17 ఏళ్ల తర్వాత అడిలైడ్ స్టేడియంలో ఓడిన టీమిండియా..
- గంభీర్ చెత్త వ్యూహాలతోనే భారత్ వరుస ఓటములు అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India vs Gambhir: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. రెండో వన్డేలో మెరుగైన బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్కు నిరాశే మిగిలింది. 265 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే పెవిలియన్ కి వెళ్లారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) కాసేపు దూకుడుగా ఆడి బౌలర్లపై ఒత్తిడి తెవడానికి ప్రయత్నించారు. రెన్ షా అవుట్ అయ్యాక బ్యాటింగ్కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇక, మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలించాడు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
Also Read
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
- Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
అయితే, అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) హాఫ సెంచరీలు సాధించగా.. అక్షర్ పటేల్ (44) రాణించాడు. కాగా అడిలైడ్లో భారత్ ఒక వన్డే మ్యాచ్లో ఓడిపోవడం మొదటిసారి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.
Read Also: Kurnool Bus Accident: క్షణాల్లో కుటుంబం మొత్తం సజీవ దహనం.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృత్యువాత..
కాగా, పిచ్ కండీషన్స్ కు తగినట్లు ఆస్ట్రేలియా మెనెజ్మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్ను పక్కన పెట్టి మరీ స్పిన్నర్ ను తీసుకుంటే, భారత్ మాత్రం ముగ్గురు ఆల్రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్ ఆడింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకుని ఏకంగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అయితే, అడిలైడ్లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇలాంటి వికెట్పై కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కానీ, గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్లో కుల్దీప్ను బెంచ్ కే పరిమితం చేశాడు. బ్యాటింగ్ డెప్త్ను కారణంగా చూపిస్తూ.. కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా తరపున ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లు సుందర్, అక్షర్, నితీన్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అలాగే, ఇరు జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!