IPL Mega Auction: తొలి లాట్లో ఉన్న ఆటగాళ్లు వీరే.. ధర రూ.5-15 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్లోని తొలి లాట్లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం.
ఈ జాబితాలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్, డుప్లెసిస్, రబాడ, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, డికాక్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరి కనీస ధర రూ.2 కోట్లు. అయితే వీరికి రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఫ్రాంచైజీలు కుమ్మరించనున్నాయి. ఆయా ఆటగాళ్ల దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమ జట్లకు ఆడిన ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. రిటైన్ పక్రియలో అవకాశం లేకపోవడంతో వాళ్లను తీసుకోలేకపోయామని.. వేలంలో కచ్చితంగా వాళ్లను సొంతం చేసుకుంటామని ఆయా ఫ్రాంచైజీలు చెప్తున్నాయి. ఈ మేరకు ధావన్ను ఢిల్లీ క్యాపిటల్స్, డుప్లెసిస్ను చెన్నై సూపర్కింగ్స్, డికాక్ను ముంబై ఇండియన్స్ జట్లు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
- Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?