Ind vs Wi: నేడే ఇండియా, విండీస్ నాలుగో టీ20.. గెలిస్తే సిరీస్ వశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Wi: వెస్టిండీస్పై వన్డే సిరీస్ను సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ పైన కూడా కన్నేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1 తేడా భారత్ ముందంజలో ఉంది. ఇవాళ జరగనున్న నాలుగో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. ఇవాళ్టి టీ20 మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండూ గెలిస్తేనే టీ20 సిరీస్ దక్కుతుంది. లేదంటే వన్డే సిరీస్ను అప్పగించినట్లే టీ20 సిరీస్ను భారత్ చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్.. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
విండీస్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్కు ముందు భారత్ ఎక్కువగా టీ20లే ఆడుతోంది. టీ20 వరల్డ్కప్ బెర్త్ దక్కాలంటే దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్లు మెరుపులు మెరిపించాల్సిందే. కాబట్టి ఇకపై వీళ్లకి ప్రతీ మ్యాచ్ కూడా ఫైనల్ పరీక్షలాంటిదే. రెండు రోజుల్లో రెండూ గెలవాల్సిన ఒత్తిడిలో వెస్టిండీస్ ఉంది. రెండో టి20లో బౌలింగ్తో బెదరగొట్టిన కరీబియన్ బౌలర్లు గత మ్యాచ్లో తేలిపోయారు. తనకు అందిన చాలా అవకాశాలను ఉపయోగించుకున్న దీపక్ హుడా, పెద్ద టిక్కెట్ టీ20 ప్రపంచకప్ బెర్త్ విషయానికొస్తే, ప్రస్తుతం అయ్యర్ను అధిగమించడం విశేషం.
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయినా ఆ జట్టు టీ20 సిరీస్లో మాత్రం పోటీనిస్తోంది. రెండో మ్యాచ్లో భారత్కు షాక్ను ఇచ్చింది. మూడో టీ20లోనూ బ్యాటింగ్లో అదరగొట్టింది. ఐతే భారత ఓపెన్ సూర్యకుమార్ షో ముందు ఆ జట్టు బౌలింగ్ నిలవలేకపోయింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో విండీస్ జట్టు గెలిస్తే సిరీస్ దక్కనుంది.
Common Wealth Games 2022: రెజ్లింగ్లో పతకాల జోరు.. పసిడి పట్టు పట్టిన రెజ్లర్లు
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్ర అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్.
వెస్టిండీస్ జట్టు: కింగ్, మయర్స్, పూరన్(కెప్టెన్), హెట్మయిర్, థామస్, పావెల్, డ్రాక్స్, హోల్డర్, హోసెన్, జోసెఫ్, మెకాయ్.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..