Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan To Lead Team India in Asian Games 2023: చైనాలోని హాంగ్జై నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఏషియన్ గేమ్స్లో ఈసారి క్రికెట్ను కూడా భాగం చేశారు. దాంతో ప్రపంచ దేశాల్లోని అన్ని జట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఏషియన్ గేమ్స్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహిళల సీనియర్ క్రికెట్ టీమ్ ఏషియన్ గేమ్స్లో పాల్గొననుండగా.. ద్వితీయ శ్రేణి పురుషుల జట్టు ఆడే అవకాశం ఉంది. ఈ జట్టుకు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా భారత్ పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక జట్లు పాల్గొన్నాయి. బీసీసీఐ మాత్రం జట్లను పంపించలేదు. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ 2023కి జట్లను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. అయితే భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో బీసీసీఐ వెనక్కి తగ్గింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టుని పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
- Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
- Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2023లో సత్తాచాటిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్లతో పాటు ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసి చైనాకు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పాల్గొనే విషయంపై జూలై 7న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు భారత జట్టు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటంపై కూడా ఓ పాలసీని రూపొందించాలనే విషయంపై కూడా చర్చించనున్నారు.
ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జైలో జరగనున్నాయి. వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి పురుషుల జట్టు, హర్మన్ప్రీత్ సారథ్యంలోని సీనియర్ మహిళల జట్టును ఏషియన్ గేమ్స్లో ఆడించాలని బీసీసీఐ చూస్తోంది. గతంలోనూ భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లపై భారత జట్టును గబ్బర్ నడిపించాడు.
Also Read: Bank Accounts Rules: ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!