Team India New Captain: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు.. అతడు టీంతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. గిల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అతడు దాదాపుగా రెండో టెస్టుకు దూరమైనట్లే తెలుస్తుంది. ఇక, గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్మెంట్
వన్డేలకు ఆ నలుగురు దూరం?
అయితే, గత కొంతకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న శుభ్మన్ గిల్కు ప్రోటీస్ జట్టుతో వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతడితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి, అతడిని ఆడించి రిస్క్ తీసుకోవద్దని సెలెక్టర్లు యోచిస్తున్నారు. అయితే, వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా కొత్త కెప్టెన్ అతడే..?
ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టు పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ దానికి ఒప్పుకోకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఈ వన్డే సిరీస్కు టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. వన్డే టీంలోకి యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి రాంచీ వేదికగా ఈ 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది.