Team India New Captain: టీమిండియా వన్డే కెప్టెన్గా ఎవరు ఊహించని పేరు..?
- దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన శుభ్మన్ గిల్..
- సఫారీ జట్టుతో వన్డే సిరీస్ కు గిల్, బుమ్రా, శ్రేయస్, పాండ్యాకు విశ్రాంతి..
- టీమిండియా కొత్త సారథిగా ఎవరు ఊహించని పేరు ప్రకటించనున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India New Captain: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు.. అతడు టీంతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. గిల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అతడు దాదాపుగా రెండో టెస్టుకు దూరమైనట్లే తెలుస్తుంది. ఇక, గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్మెంట్
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
వన్డేలకు ఆ నలుగురు దూరం?
అయితే, గత కొంతకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న శుభ్మన్ గిల్కు ప్రోటీస్ జట్టుతో వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతడితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి, అతడిని ఆడించి రిస్క్ తీసుకోవద్దని సెలెక్టర్లు యోచిస్తున్నారు. అయితే, వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా కొత్త కెప్టెన్ అతడే..?
ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టు పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ దానికి ఒప్పుకోకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఈ వన్డే సిరీస్కు టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. వన్డే టీంలోకి యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి రాంచీ వేదికగా ఈ 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!