Team India New Captain: టీమిండియా వన్డే కెప్టెన్గా ఎవరు ఊహించని పేరు..?
- దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన శుభ్మన్ గిల్..
- సఫారీ జట్టుతో వన్డే సిరీస్ కు గిల్, బుమ్రా, శ్రేయస్, పాండ్యాకు విశ్రాంతి..
- టీమిండియా కొత్త సారథిగా ఎవరు ఊహించని పేరు ప్రకటించనున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India New Captain: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు.. అతడు టీంతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. గిల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అతడు దాదాపుగా రెండో టెస్టుకు దూరమైనట్లే తెలుస్తుంది. ఇక, గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్మెంట్
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
వన్డేలకు ఆ నలుగురు దూరం?
అయితే, గత కొంతకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న శుభ్మన్ గిల్కు ప్రోటీస్ జట్టుతో వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతడితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి, అతడిని ఆడించి రిస్క్ తీసుకోవద్దని సెలెక్టర్లు యోచిస్తున్నారు. అయితే, వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా కొత్త కెప్టెన్ అతడే..?
ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టు పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ దానికి ఒప్పుకోకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఈ వన్డే సిరీస్కు టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. వన్డే టీంలోకి యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి రాంచీ వేదికగా ఈ 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..