ఆదాయం పై బీసీసీఐ ఫోకస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయం పెంపొందించుకోవడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2022 ఎడిషన్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా.. ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. మరోవైపు.. ఫ్రాంచైజీల కొనుగోలుకు వ్యాపారదిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. భారీ ప్రణాళికలు వేసింది. 2022 ఎడిషన్ ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. ప్రస్తుతం ఐపీఎల్లో 8 జట్లు మాత్రమే ఉన్నాయి. 2022 ఎడిషన్లో వీటి సంఖ్య 10కి పెరగనుంది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ విధివిధానాలు ఇప్పటికే ఖరారు కాగా, బీసీసీఐ …ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం టెండర్లు పిలిచింది. ఫ్రాంచైజీ కొనుగోలుకు అక్టోబరు 5 వరకు గడువు ఉంది.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయిన బిడ్ డాక్యుమెంటును కొనుగోలు చేసుకోవచ్చు. రెండు కొత్త జట్లకు కనీస ధరను గతంలో 1700 కోట్లుగా నిర్ణయించిన బీసీసీఐ …తాజాగా, ఆ ధరను 2 వేల కోట్లకు పెంచింది. అంతా అనుకున్నట్టు జరిగితే రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా బీసీసీఐకి 5 వేల కోట్లు, అంతకుమించి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ వచ్చే సీజన్లో 74 గేమ్స్ ఉంటాయి. దీంతో బరిలో నిలవాలంటే ప్రతీ జట్టుకు విజయం తప్పనిసరి కానుంది.
వార్షిక టర్నోవరు 3 వేల కోట్ల రూపాయలు కలిగిన కంపెనీ మాత్రమే బిడ్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొత్త జట్ల వేదికలలో అహ్మదాబాద్, లక్నో, పూణె ఉండే అవకాశం ఉంది. అదానీ గ్రూప్, ఆర్పీజీ సంజీవ్ గోయెంక గ్రూప్తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్.. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!