India vs New Zealand: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టు ఇదే..
- న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా..
- నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియాలో కేవలం ఒక్క మార్పు చేసింది. యువ పేసర్ యశ్ దయాల్ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు. అతడి స్థానంలో కొత్త ప్లేయర్ ని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్తో సిరీస్ కోసం ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లను తుది జట్టులోకి తీసుకుంది.
Read Also: India vs Bangladesh 3rd T20: నేడే బంగ్లాతో భారత్ చివరి మ్యాచ్.. ఉప్పల్లో క్లీన్స్వీప్ చేస్తారా..?
Also Read
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
అలాగే, మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా బీసీసీఐ పేర్కొనింది. ఇటీవల బంగ్లాదేశ్పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్ మయాంక్ యాదవ్తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలను ఈ లిస్ట్ లో చేర్చింది. బ్యాట్స్మెన్ల ఎంపిక విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్లను సెలక్టర్లు పట్టించుకోలేదు.
Read Also: Suriya: వామ్మో సూర్య ఇదేం స్పీడు.. మరీ డిసెంబర్ నుంచేనా ?
ఇక, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సెలక్టర్లు కొత్త వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. 2022లో ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా సారథిగా వ్యవహరించాడు. అందుకే వైస్ కెప్టెన్గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. నిజానికి ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లకు వైఎస్ కెప్టెన్ లేరు. నవంబర్లో ఆస్ట్రేలియాతో జగరనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ టెస్ట్ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్గా బుమ్రాను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి
న్యూజిలాండ్ సిరీస్కు టీమిండియా తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.. ఇక, ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!