Boycott Asia Cup: బాయ్కాట్ ఆసియా కప్.. పాక్తో మ్యాచ్ వద్దంటున్న ఫ్యాన్స్
- ట్రెండింగ్ లో బాయ్కాట్ ఆసియా కప్..
- పాక్ తో భారత జట్టు మ్యాచ్ ఆడొద్దంటున్న నెటిజన్స్..
- పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారితో మ్యాచ్ ఆడటం ఏంటి?..
- పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటానికి బీసీసీఐకి మనసెలా వచ్చింది: నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boycott Asia Cup: ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు రెండుసార్లు తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 14, 21వ తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఆసియా కప్ హోస్ట్ హక్కులు టీమిండియావే అయినప్పటికీ, యూఏఈ వేదికగానే మ్యాచులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు అభిమానుల కోపానికి కారణమైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో క్రికెట్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. తాజాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ భారత్ ఛాంపియన్స్-పాక్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ను రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆసియా కప్లో భారత్- పాక్ మ్యాచ్లు నిర్వహించాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
ఇక, భారత్-పాక్ మ్యాచ్లను బహిష్కరించాలని సోషల్ మీడియాలో అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. “బాయ్కాట్ ఆసియా కప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, కార్గిల్ విజయ్ దివస్ రోజునే ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడం దారుణం.. సెప్టెంబర్ 14న భారత్- పాక్ మ్యాచ్ జరగడం పరోక్షంగా పీసీబీకి నిధులను సమకూర్చడమే.. అదే డబ్బును మన మీదనే దాడి చేయడానికి ఉపయోగిస్తారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి, “భారత ఆర్మీ పట్ల గౌరవం ఉంటే పాక్తో మ్యాచ్లను ఆడకూడదు.. కుదిరితే ఆసియా కప్ను బహిష్కరించండి అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఒకవైపు, ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు, పాక్తో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ రెడీ కావడం.. అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: SunPictures : సెన్సార్ బోర్డ్ పై హైకోర్టుకు సన్ పిచర్స్.. ఎన్నడా ఇది!
మరోవైపు, పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంటే.. బీసీసీఐ మాత్రం మ్యాచ్ లు ఆడటం అభిమానుల కోపానికి గురైతుంది. దాయాది దేశంతో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐకి మనసెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం, ఆటలు కలిసి సాగలేవు అని పేర్కొంటున్నారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యమా అని అడుగుతున్నారు. దేశ ప్రజల ప్రాణాల కన్నా క్రికెట్ ఇంపార్టెంట్ హా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజల మనోభావాల కన్నా కాసుల కిక్కే బీసీసీఐకి తృప్తినిస్తుందా.. డబ్బుల కోసం బీసీసీఐ ఎంతకైనా దిగజారుతుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!