Dunith Wellalage: వాళ్లిద్దరి వికెట్లు ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. శ్రీలంక సెన్సేషన్ వెల్లలాగే ఫుల్ ఖుషీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు. సూపర్ 4లో నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో తన స్పిన్ తో భారత స్టార్ బ్యాటర్లను కట్టిపడేశాడు. కేవలం 213 పరుగులకే ఇండియా ఆలౌట్ కావడానికి కారకుడయ్యాడు. భారత టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. మరోవైపు బ్యాటింగ్ లో కూడా చివరిదాకి నిలబడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేశాడు.
Read Also: Chandrababu Arrest: సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్.. ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
శ్రీలంక ఓడిపోయిన ఈ కుర్రాడు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరి వికెట్లను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెబుతున్నాడు. 40 పరుగులకే 5 వికెట్లు తీసిన వెల్లలాగే వీరిద్దరితో పాటూ హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ వికెట్లు తీశారు. టీంలో ఉన్న స్టార్ బ్యాటర్లందరిని ఫెవిలియన్ కు పంపాడు. తన బేసిక్స్ కి అనుగుణంగా, లైన్ మిస్సవ్వకుండా బౌలింగ్ చేశానని, దీంతోనే భారత్ ని ఒత్తడికి నెట్టేశానని అన్నారు.
ఇటు బౌలింగ్ లో సత్తా చాటిన వెల్లలాగే, బ్యాటింగ్ లో భారత్ ని కలవరపెట్టాడు. సీనియర్ ప్లేయర్లు ఒక్కక్కరుగా ఔట్ అవుతున్నా.. చివరదాకా క్రీజులో నాటౌట్ గా నిలిచాడు. వెల్లలాగే 46 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వాతో కలిసి ఏడో వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక విజయవకాశాలు మెరుగయ్యాయి. ఒకానొక సమయంలో ఈ జోడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేసింది. జడేజా, కుల్దీప్ విజయానికి కళ్లేం వెశారు. శ్రీలంక 172 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక తర్వాతి మ్యాచులో పాకిస్తాన్ తో తలపడనుంది. ఒక వేళ మ్యాచులో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!