New Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారాయి.. పాటించకపోతే రూ.10వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Traffic Rules: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వాహనాలు, ట్రాఫిక్కు సంబంధించిన నియమాలలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. వాటిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే లేదా పాత వాహనాన్ని నడుపుతున్నట్లయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్ర్కాప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు వర్తిస్తాయి. అటువంటి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడతాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను ప్రభుత్వ రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. ఈ కేంద్రాల వద్ద వాహనాలను రద్దు చేస్తారు. దీని తర్వాత వాహన యజమానికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
Read Also: Uttar pradesh: యూపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Also Read
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
అప్పుడు వాహన యజమాని కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ మొత్తంపై సబ్సిడీ పొందుతారు. అదే సమయంలో పాత వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కఠినంగా వ్యవహరించింది. రోడ్డుపై 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనం కనిపించగానే నేరుగా జప్తు చేసి స్క్రాప్ యార్డుకు పంపుతారు. ఇటీవల అందిన సమాచారం మేరకు సివిల్ లైన్స్ పరిధిలో 50 వాహనాలను సీజ్ చేసి స్క్రాప్ యార్డుకు పంపారు. నిజానికి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే స్క్రాప్ విధానాన్ని అమలు చేశారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ఢిల్లీలో పాత వాహనాలను ప్రజలు ఆపడం లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఆప్ ప్రభుత్వం ఈ విధానంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తన చర్యలను ప్రారంభించింది.
Read Also:Safest Banks List: RBI ప్రకారం.. దేశంలో సురక్షితమైన బ్యాంకులు ఇవేనట
ఈ క్రమంలోనే ఢిల్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సిఆర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా మొత్తాన్ని నేరుగా ఖాతా నుండి తీసివేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ఢిల్లీలోని ప్రైవేట్ బస్సులు, గూడ్స్ క్యారియర్లకు కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూల్స్ పాటించని వారిపై భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. కొన్ని నిబంధనల ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 192-ఎ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?