New Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారాయి.. పాటించకపోతే రూ.10వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Traffic Rules: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వాహనాలు, ట్రాఫిక్కు సంబంధించిన నియమాలలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. వాటిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే లేదా పాత వాహనాన్ని నడుపుతున్నట్లయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్ర్కాప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు వర్తిస్తాయి. అటువంటి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడతాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను ప్రభుత్వ రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. ఈ కేంద్రాల వద్ద వాహనాలను రద్దు చేస్తారు. దీని తర్వాత వాహన యజమానికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
Read Also: Uttar pradesh: యూపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
అప్పుడు వాహన యజమాని కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ మొత్తంపై సబ్సిడీ పొందుతారు. అదే సమయంలో పాత వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కఠినంగా వ్యవహరించింది. రోడ్డుపై 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనం కనిపించగానే నేరుగా జప్తు చేసి స్క్రాప్ యార్డుకు పంపుతారు. ఇటీవల అందిన సమాచారం మేరకు సివిల్ లైన్స్ పరిధిలో 50 వాహనాలను సీజ్ చేసి స్క్రాప్ యార్డుకు పంపారు. నిజానికి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే స్క్రాప్ విధానాన్ని అమలు చేశారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ఢిల్లీలో పాత వాహనాలను ప్రజలు ఆపడం లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఆప్ ప్రభుత్వం ఈ విధానంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తన చర్యలను ప్రారంభించింది.
Read Also:Safest Banks List: RBI ప్రకారం.. దేశంలో సురక్షితమైన బ్యాంకులు ఇవేనట
ఈ క్రమంలోనే ఢిల్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సిఆర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా మొత్తాన్ని నేరుగా ఖాతా నుండి తీసివేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ఢిల్లీలోని ప్రైవేట్ బస్సులు, గూడ్స్ క్యారియర్లకు కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూల్స్ పాటించని వారిపై భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. కొన్ని నిబంధనల ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 192-ఎ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!