Hyderabadis Ott Mentality: హైదరాబాద్లోని ఓటీటీ సబ్స్క్రైబర్లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabadis Ott Mentality: హైదరాబాద్లోని ఓటీటీ సబ్స్క్రైబర్ల మెంటాలిటీకి సంబంధించి ఒక కొత్త నివేదిక విడుదలైంది. ఈ రిపోర్ట్ని రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ అనే ఫేమస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
హైదరాబాదీలు ప్రతి రోజూ మూడు గంటలకు పైగా సమయాన్ని ఓటీటీ కంటెంట్ చూస్తూ గడుపుతున్నారు. వీకెండ్స్లో అయితే మరో పది శాతం టైం కేటాయిస్తున్నారు. దీన్నిబట్టి.. హైదరాబాదీల నిత్య జీవితంలో ఓటీటీలు అంతర్భాగమయ్యాయని చెప్పొచ్చు. ఓటీటీ వ్యూవర్స్లో మహిళలు మరియు పురుషుల ఆసక్తులు వేర్వేరుగా ఉన్నాయి.
Also Read
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే 'డెడ్లీ' లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
వయసును బట్టి కూడా ఈ ఇంట్రస్ట్ మారుతోంది. మహిళల్లో 60 శాతం మంది తెలుగు కన్నా హిందీ, ఇంగ్లిష్ కంటెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరం మొత్తమ్మీద 52 శాతం మంది హిందీ కంటెంట్కే ఓటేస్తున్నారు. అంటే.. ప్రాంతీయ ఓటీటీలు హైదరాబాదీలను ఆకట్టుకోవటంలో వెనకబడుతున్నాయని అర్థంచేసుకోవచ్చు.
ఎందుకంటే.. హిందీ తర్వాత.. ఇంగ్లిష్ కంటెంట్ని 28 శాతం మంది వీక్షిస్తున్నారు. ఇందులో సగం మందే.. అంటే.. కేవలం 14 శాతం మందే తెలుగు కంటెంట్కి ప్రయారిటీ ఇస్తున్నారు. హైదరాబాద్లోని పెయిడ్ ఓటీటీ చందాదారుల్లో మరియు వీక్షణ ప్రాధాన్యతల్లో ఒక తరం అంతరం ఉందని ఈ తాజా నివేదిక గుర్తించింది.
వయసు 36 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో 55 శాతం మంది కుటుంబ సభ్యులతో కలిసి చూడాలనుకుంటున్నారు. 26 ఏళ్ల లోపు యువతీ యువకులు మాత్రం ఓటీటీని ఒంటరిగానే వీక్షించాలని కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. మ్యూజిక్ స్ట్రీమింగ్ చేసేవారి వాటా 62 శాతం కావటం విశేషం.
ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్లో ఓటీటీ వేదికలపై ప్రైమ్ వీడియోలను 70 శాతం మంది యూజర్లు చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ కలిగినవాళ్లలో 77% మంది ఉద్యోగాలు చేసేవారు మరియు సొంత వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. నెలకి యావరేజ్గా 60 వేల రూపాయలు సంపాదించేవారు సైతం ఓటీటీ వీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా కంటెంట్ సృష్టించటం కీలకమని రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని అన్నారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!