అరవై ఏళ్ళ ‘శాంత’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)
నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ సినిమాలో యన్టీఆర్, అంజలి తనయునిగా నటించిన చలం, ‘పరువు-ప్రతిష్ఠ’లోనూ వారి కొడుకుగానే నటించారు. పైగా రెండు చిత్రాలలోనూ చలం పేరు వేణు కావడం గమనార్హం! మరో విశేషమేమంటే, యన్టీఆర్, అంజలీ జంటగా నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’లో ఆమె పేరు శాంత. అందువల్లే ఈ చిత్రానికి ‘శాంత’ అన్న టైటిల్ ను నిర్ణయించినట్టు అప్పట్లో నిర్మాతదర్శకులు చెప్పారు.
‘శాంత’ కథ విషయానికి వస్తే, అందమైన శాంతపై దయానిధి అనే కామాంధుడు కన్నేస్తాడు. పలు పాట్లు పడి అతని నుండి, మరికొందరు దుర్మార్గుల నుండి తప్పించుకొని లాయర్ శ్రీనివాస్ చెంత చేరుతుంది. అతని భార్య చనిపోయి, ఓ కొడుకు ఉంటాడు. ఆ అబ్బాయి పేరు కుమార్. అతణ్ణి శాంత కన్నకొడుకులా చూస్తుంది. దాంతో శ్రీనివాస్, శాంతను పెళ్ళాడతాడు. మళ్ళీ దయానిధి, శ్రీనివాస్ మిత్రునిగా ఇంట ప్రవేశించి, అతణ్నే చంపాలని చూస్తాడు. విషం కలిపిన పాలు త్రాగి కుమార్ మరణించడంతో, శాంతను శ్రీనివాస్ అనుమానించి, ఇంట్లోంచి గెంటేస్తాడు. ఆత్మహత్యకు పాల్పడబోతున్న శాంతకు ఓ పసిపాప కనిపిస్తుంది. దయానిధి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలి కూతురు ఆ పాప. ఆ పసిపాపను పెంచి పెద్ద చేస్తుంది. సరోజ అనే పేరు పెడుతుంది. శ్రీనివాస్ కొడుకు వేణు, సరోజ ఒకే చోట చదువుకోవడంతో ప్రేమలో పడతారు. చివరకు విషయం తెలుసుకున్న శ్రీనివాస్, వేణు కలసి దయానిధికి బుద్ధి చెప్పడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
- World's First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, కేవీఎస్ శర్మ, కృష్ణకుమారి, సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, బాలసరస్వతి నటించారు. ఆరుద్ర, కొసరాజు, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. సముద్రాల జూనియర్ సంభాషణలు కూడా పలికించారు. ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. యన్టీఆర్ కు రమేశ్ నాయుడు స్వరకల్పన చేసిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత 1973లో యన్టీఆర్ ‘దేవుడు చేసిన మనుషులు’కు మళ్ళీ రమేశ్ నాయుడు సంగీతం అందించారు. శాంతికళ ఫిలిమ్స్ పతాకంపై ‘శాంత’ రూపొందింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?