Akshat Greentech : తెలంగాణలో అక్షత్ గ్రీన్టెక్ భారీ పెట్టుబడులు
- తెలంగాణలో అక్షత్ గ్రీన్టెక్ భారీ పెట్టుబడులు
- దశలవారీగా రూ.2,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్ట్
- పీసీబీలు, సెన్సార్లు, హై-ఎండ్ కాంపోనెంట్ల ఉత్పత్తి
- రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshat Greentech : భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రానిక్స్ మిషన్కు తెలంగాణ రాష్ట్రం కీలక మద్దతుగా నిలవనుంది. ఈ దిశగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విస్తరణకు మరొక కీలక ముందడుగు పడింది. లండన్, తెలంగాణకు చెందిన కైలాస్ ఫ్యామిలీ నేతృత్వంలో ఉన్న అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందం ద్వారా అక్షత్ గ్రీన్టెక్ సంస్థ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. దశలవారీగా సుమారు రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో సంస్థ ఉంది. ఈ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు కాంపోనెంట్ తయారీ పథకం’ మార్గదర్శకాల ప్రకారం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారే ప్రధాన లక్ష్యంగా అక్షత్ గ్రీన్టెక్ తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా మల్టీ లేయర్ పీసీబీలు, కాపర్ క్లాడ్ లామినేట్లు, సెన్సార్లు, యాంటెనాలు, ట్రాన్స్డ్యూసర్లు వంటి అత్యాధునిక కాంపోనెంట్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత బలోపేతం కానుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
భారీ పెట్టుబడులతో అమలుకాబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి వేగం పెరగడంతో పాటు, యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీలో తెలంగాణను దేశంలోనే ఒక ప్రముఖ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!