Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తిని కేర్ ఆస్పత్రి తరపున సత్కరించారు. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్ని ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం, “అందరికీ ఆరోగ్యం” అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO నిర్ణయించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఒక మంచి ఆరోగ్య ఐకాన్ మరియు శతాబ్ది స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఏటుకూరి కృష్ణమూర్తి (102 సంవత్సరాల) గారిని సత్కరించడం జరిగిందని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ నీలేష్ గుప్తా తెలిపారు. ఆయన రోజు వారి దినచర్యలు మరియు ఆరోగ్యం రహస్యాలు ఆసుపత్రి సిబ్బందికి తెలియచేయాలిని నీలేష్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తి గారు వ్రాసిన “ప్రజా వైద్యం” అనే పుస్తకం ఎంతమందిని ఆకట్టుకుంది మరియు ఎన్నో ఆరోగ్య సూత్రాలను నేర్పిదని ఆయన కొనియాడారు.
Read Also: మార్చి నెల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్-10 కార్లు ఇవే..
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఈ సందర్భంగా శ్రీ ఏటుకూరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ మన జీవనశైలి , అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నారు తెలిసో , తెలియకో ఆహార పదార్థలు , ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తాయన్నారు కాబట్టి అటువంటి విషయాలని తెలుసుకొని రోజు వారి దిన చరియలు పాటించాలని ఆయన తెలిపారు. మరియు ఫిట్నెస్, ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలసిఉండాలని యోగా చేసే క్రమంలో కొని దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. యువకులందరూ సత్యం మరియు ధర్మాన్ని అనుసరించి చివరికి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని అభ్యర్థిచారు .
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబందితో పాటు వైద్య నిపుణులు , ఆస్పత్రి మెడికల్ సూపెరిండేంట్ డాక్టర్ అజిత్ సింగ్, సి.ఓ.ప్.సి. హెడ్ మిస్టర్ రూఫుస్ అగస్టీన్, సి.ఓ.ప్.సి. అడ్మిన్ విభాగాధిపతి మిస్టర్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?