కేబినెట్పై ఆశలు పెట్టుకున్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేబినెట్లో చోటుకోసం ఎదురు చూస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను రెండున్నరేళ్ల గడువు ఊరిస్తోంది. జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రేస్లో వెనకబడకుండా.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శాసనసభ్యులు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి వారిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కర్నూలు జిల్లా నుంచి కేబినెట్లో చోటుదక్కేది ఎవరికి?
Also Read
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పాటుకాగానే.. మొదటి జాబితాలోనే మంత్రి కావాలని ఆశించినవారు అనేక మంది. సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు సీరియస్గానే ప్రయత్నించారు. కానీ.. రాజకీయ, సామాజిక సమీకరణాలు వారి ఆశలకు గండికొట్టాయి. కాకపోతే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని నాడు.. సీఎం జగన్ చేసిన ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఇప్పుడా సమయం దగ్గర పడుతుండటంతో మంత్రివర్గంలో చోటుకోసం సీనియర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. కర్నూలు జిల్లా నుంచి కేబినెట్లో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిలో ఎవరిని మారుస్తారో ఏమో.. జిల్లాలో కొత్తగా రేస్లో ఉన్నవారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది.
ఆరోసారి ఎమ్మెల్యేగా ఉన్న రాంభూపాల్రెడ్డికి ఛాన్స్ ఉంటుందా?
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రస్తుతం ఆరోసారి ఎమ్మెల్యే. YS సీఎంగా ఉన్న సమయంలోనే మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ‘నేను ఉన్నాను కదా.. నీకు మంత్రి పదవి అవసరమా?’ అని నాడు వైఎస్ అనడంతో రాంభూపాల్రెడ్డి మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచినా మంత్రి కాలేకపోయాననే బాధ అలాగే ఉండిపోయింది. దీంతో ఈసారి ఎలాగైన బెర్త్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారట. సీనియరిటీని సీఎం జగన్ గుర్తిస్తారని.. తనకు న్యాయం చేస్తారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట రాంభూపాల్రెడ్డి. ఓ సందర్భంలో సీఎం జగన్ను కలిసినప్పుడు..తనను దృష్టిలో ఉంచుకోవాలని కూడా ఆయన కోరారట.
కేబినెట్లో చోటు దక్కుతుందనే ఆశలో చక్రపాణి రెడ్డి
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా నాడు మంత్రివర్గంలో చోటు కోసం వైసీపీ ముఖ్యులతో తీవ్రంగా ప్రయత్నించారట. అప్పట్లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు చక్రపాణి రెడ్డి. టీడీపీ మండలి ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా వదలుకొన్నానని చెబుతూ.. వైఎస్ కుటుంబంలో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తున్నారట. చక్రపాణి సైతం ఈ దఫా తప్పకుండా మంత్రి అవుతాననే గట్టి నమ్మకంతో ఉన్నారట.
సాయి ప్రసాద్రెడ్డి కోసం సాయం పడుతున్న సోదరులు!
ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి సైతం కేబినెట్లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. ఆయన మూడోసారి ఎమ్మెల్యే. సాయి ప్రసాద్రెడ్డి సోదరుల్లో బాలనాగిరెడ్డి మంత్రాలయం, వెంకట్రామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తమ కుటుంబం నుంచి సాయి ప్రసాదరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సోదరులు కూడా కృషి చేస్తున్నారట. కర్నూలు జిల్లా నుంచి ఈ దఫా ఎంత మందికి చోటు దక్కుతుందో కానీ.. రేస్లో ఉన్నవారంతా సీనియర్లే. అందుకే మంత్రివర్గం నుంచి అవుటయ్యేది .. కొత్తగా ఎంట్రీ ఇచ్చేది ఎవర్నది ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!