YCP : అకస్మాత్తుగా ఆ వైసీపీ ఎంపీ ఎందుకు వేడి పుట్టిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటగిరి శ్రీధర్. ఏలూరు వైసీపీ ఎంపీ. సీనియర్ పొలిటీషియన్ కోటగిరి విద్యాధరరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్.. తండ్రి స్థాయిలో ప్రభావం చూపడం లేదన్నది అనుచరుల మాట. 2019లో ఎంపీగా గెలిచాక.. నియోజకవర్గ పరిధిలోనే నల్లపూస అయిపోయారు. అప్పుడప్పుడూ వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడమే తప్ప.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి. అలాంటి శ్రీధర్.. కొత్త కొత్త కామెంట్స్తో చర్చల్లో వ్యక్తిగా మారిపోయారు. కీలక అంశాలనే టచ్ చేస్తూ.. కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నారు.
తిరుమలలో బీజేపీ, వైసీపీ సంబంధాలపై వ్యాఖ్యలు చేసిన శ్రీధర్.. ఏలూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో మరో అడుగు ముందుకేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం జగన్ త్వరలో పరిష్కరిస్తారని చెప్పకొచ్చారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. సీఎం జగన్ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని జోస్యం కూడా చెప్పేశారు శ్రీధర్. మూడేళ్లుగా సైలెంట్గా ఉన్న ఎంపీ.. ఎందుకిలా మారిపోయారు? సంచలన అంశాల జోలికి ఎందుకెళ్తున్నారు? అనేది పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశాల్లో జనంలో లేని నేతలకు ఈసారి అవకాశం ఇవ్వబోనని సీఎం జగన్ తేల్చి చెప్పడంతో ఎంపీ శ్రీధర్ ఆలోచనలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్న ఆయన.. అధినేత హెచ్చరికలు ప్రతికూలంగా మారకుండా జనం అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సీఎం జగన్ను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్. పార్టీ ప్లీనరీలో ఎంపీగా తాను చేసింది ఏంటో.. చేయబోయేది ఏంటో చెప్పకుండా.. ఏదేదో ప్రస్తావించి వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు.. పోలవరం మినహా మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో ఎంపీ శ్రీధర్కు సఖ్యత లేదని చెబుతారు. చింతలపూడి, నూజివీడుల్లో గ్రూపు రాజకీయాలకు తెరతీశారనే విమర్శలు ఎంపీపై ఉన్నాయి. నియోజకవర్గాల్లోని నేతలతోనూ పెద్దగా సంబంధాలు లేవని.. విద్యాధర్రావు.. శ్రీధర్ పనితీరుల్లో ఎంతో తేడా ఉందని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో శ్రీధర్కు టికెట్ కష్టమనే ప్రచారం చాపకింద నీరులా మొదలైంది. ఆ విషయం తెలిసే.. ఎంపీ రూటు మార్చేశారని అనుమానిస్తున్నారు. మొత్తానికి తన సీటుకు ఎసరు రాకుండా శ్రీధర్ వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే ఆయన కామెంట్స్ను చూస్తున్నాయి పార్టీ శ్రేణులు. మరి.. మారిన వైఖరి ఎంపీ శ్రీధర్కు ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!