Etela Rajender : ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదు? ఆయనకు అందిన సమాచారం ఏంటి? ముందు జాగ్రత్త పడ్డారా.. లేక ఇంకేదైనా కారణం ఉందా? రాజకీయ వర్గాల్లో చర్చగా ఉన్న ఆ అంశం ఏంటి? లెట్స్ వాచ్..!
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అన్నట్టు ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ అసెంబ్లీ సెషన్ కి అనుమతి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ కనిపించింది. అయితే బీజేపీ శాసనసభ్యులు మొదటి రోజు సమావేశానికి హాజరు అయ్యారు. కాకపోతే bac మీటింగ్కు బీజేపీకి ఆహ్వానం పంపలేదు. దీంతో ఎమ్మెల్యేలు సభాపతిని, ప్రభుత్వాన్ని టార్గెట్గా కొన్ని కామెంట్స్ చేశారు. అసెంబ్లీ స్పీకర్పై ఈటల వాడిన పదజాలంపై అధికారపక్షం తీవ్రంగా మండిపడింది. ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే క్షమాపణకు ససేమిరా అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.
Also Read
శాసన సభ సమావేశాలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా బీజేపీ సభ్యులపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సభ నుంచి ఈటలను సస్పెండ్ చేస్తారని.. సభలోకి రానివ్వకపోవచ్చని అసెంబ్లీ వర్గాల్లో టాక్ వినిపించింది. పోలీసులు కూడా భారీగానే మోహరించారు. ఆ సమాచారం అందడం వల్లే ఈటల అసెంబ్లీకి రాలేదని తెలుస్తోంది. ఈటల కూనడా తనను సస్పెండ్ చేస్తారని భావించి ఉంటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. అందుకే అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు అని భావించి దూరంగా ఉన్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే శాసనసభ సమావేశాల్లో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదు.
తాజా సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలలో రఘునందన్ రావు మాత్రమే శాసన సభకు వచ్చారు. అలా అని ఈటల ఇంటికో.. హైదరాబాద్కో దూరంగా లేరు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ సభలో పాల్గొన్నారు. ఆ సభలో తీవ్ర విమర్శలే చేశారు. అంతేకాదు.. సినీ నటుడు.. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియల్లోనూ ఈటల పాల్గొన్నారు. సంజయ్ పాదయాత్ర సందర్భంగా సూరారంలో నిర్వహించిన బీజేపీ సభలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా మరోసారి మాటల దాడి చేశారు ఈటల. అదీ అసెంబ్లీ అంశం బ్యాక్డ్రాప్లోనే ఆ వ్యాఖ్యలు ఉండటంతో.. సభకు రాకపోవడానికి.. ఆయన స్పందించిన దానికి లింక్ ఉందనే చర్చ నడుస్తోంది.
తాజా పరిణామాలు చూశాక.. ఈటల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!