TRS :రెడ్డి సింహ గర్జనకు అధికార పార్టీ నుంచి ఆ ఒక్క మంత్రే ఎందుకు వెళ్లారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘట్కేసర్లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు మల్లారెడ్డి. అంతేకాదు.. రేవంత్ వర్గమే తన హత్యకు కుట్ర చేసిందని మంత్రి మండిపడ్డారు. అసలు రెడ్డి జాగృతి సభకు అనుమతి ఇప్పించిందే తానని.. సభా ఏర్పాట్లలో తన అనుచరులు ఉన్నారని వాదిస్తున్నారు మల్లారెడ్డి.
అయితే..ఘాట్ కేసర్ సభకు అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రముఖులు అక్కడికి వెళ్లలేదు. మంత్రి మల్లారెడ్డి మాత్రమే కనిపించారు. రెడ్డి సింహగర్జన సభకు రావాలని రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇతర టీఆర్ఎస్ నేతలను నిర్వాహకులు ఆహ్వానించారా లేదా అనే చర్చ మొదలైంది. ఒకవేళ పిలిచినా ఎందుకు వెళ్లలేదు. ఎందుకు ఆసక్తి చూపించలేదు అని మరికొందరు ఆరా తీస్తున్నారట. పైగా రెడ్డి కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని పలు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి మల్లారెడ్డి చాలా రిస్క్ తీసుకునే ఆ సభకు వెళ్లారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
రెడ్డి సింహగర్జన సభ వెనక పీసీసీ చీఫ్ రేవంత్ ఉన్నారనే అనుమానాలు అధికార పార్టీలో ఉన్నాయట. ఆ విషయం తెలిసే చాలా మంది టీఆర్ఎస్లోని రెడ్డి సామాజిక వర్గం నేతలు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డికే ఆ సంగతి తెలియలేదని తాజాగా చెవులు కొరుక్కుంటున్నారు. రెడ్డి సింహగర్జనకు వెళ్లి.. రెడ్డి సామాజికవర్గానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలనుకున్నారట మల్లారెడ్డి. అయితే మంత్రికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తాను మాట్లాడుతున్నంత సేపూ అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఏం చేయాలో మల్లారెడ్డికి తెలియలేదట. అందుకే ఈ ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ కలర్ తీసుకుని రచ్చ రచ్చ అవుతోంది.
టీఆర్ఎస్లోని ఇతర రెడ్డి సామాజికవర్గానికి చెందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల మాదిరే మల్లారెడ్డి కూడా సైలెంట్గా ఉండిఉంటే సరిపోయేదని చెబుతున్నారు. కనీసం వెళ్లేటప్పుడైనా పార్టీ పెద్దలతో.. పార్టీలోని తన సామాజికవర్గం నేతలతో మాట్లాడినా మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారట. సింగిల్గా వెళ్లి క్రెడిట్ కొట్టేయాలని అనుకున్నారో ఏమో కానీ.. మంత్రి మల్లారెడ్డి సెల్ఫ్గోల్ వేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!