TCongress : టీ-కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఎవరి లక్ష్యంగా జరిగింది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం కూడా ఇవ్వకపోవడం ఏంటనే చర్చ జరిగింది. దీనికి తోడు…పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది అని చెప్పి…దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఏదో జరుగుతోందని నాయకులు అంతా ఓపెన్ అయిపోతే….తలనొప్పి తెచ్చుకున్నట్టు మారిపోయింది అని అనుకుంటున్నారట.
పార్టీ చేసిన తీర్మానంలో..ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ విధానాలకు అందరూ కట్టుబడి ఉండాలని..రెండోది వ్యక్తి పూజ మానుకోవాలి అనే రెండు రాజకీయ తీర్మానాలు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇన్నాళ్లు పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఈ రెండు అంశాల మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సమావేశంలో తీర్మానాలు కూడా ఇవే చేయడంతో రేవంత్ను ఉద్దేశించే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని టాక్. సరిగ్గా ఇదే సమయంకి రేవంత్ రెడ్డి లేకపోవడం తో… వ్యతిరేక శిబిరం ఇలాంటి నిర్ణయాలు చేశారనే రేవంత్ శిబిరంలో చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి…లేకుండా చింతన్ శిబిర్ నిర్వహించడంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం సమావేశం జరిగిందని చెప్తున్నారు నేతలు. ఏఐసీసీ చెప్పినా…రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్ళారా..? నేను లేకుండా సమావేశాల ఎలా జరుగుతాయని చూడాలని అనుకున్నారా?అనే టాక్ ఉంది. పార్టీ సీరియస్గా విధానపరమైన నిర్ణయాలు…వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న సభలో రేవంత్ లేకపోవడంతో రాంగ్ ఇండికేషన్ వెళ్ళినట్లయిందనేది కొంతమంది వాదన.
Also Read
రేవంత్ను వ్యతిరేకించే టీం నాయకులే…చింతన్ శిబిర్లో కీలకంగా పని చేయడం…పార్టీలో కొన్ని అనుబంధ సంఘాల నాయకులు కూడా ఒకరిద్దరు సీనియర్ నాయకుల వద్ద రేవంత్ లేకుండా జరిగిన సమావేశాలపై కామెంట్స్ కూడా చేశారు. సమావేశాలు ముగిసిన వెంటనే…చింతన్ శిబిర్ సమావేశ ప్రాంగణంలోనే pac నిర్వహించాలని అనుకున్నారు. ఠాగూర్ హడావుడిగా వెళ్లిపోవడం…Pac సమావేశం రద్దు అవ్వడం…వెనక పెద్ద రాజకీయమే నడిచిందనే టాక్ ఉంది.
తాజావార్తలు
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!