TCongress : టీ-కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఎవరి లక్ష్యంగా జరిగింది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం కూడా ఇవ్వకపోవడం ఏంటనే చర్చ జరిగింది. దీనికి తోడు…పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది అని చెప్పి…దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఏదో జరుగుతోందని నాయకులు అంతా ఓపెన్ అయిపోతే….తలనొప్పి తెచ్చుకున్నట్టు మారిపోయింది అని అనుకుంటున్నారట.
పార్టీ చేసిన తీర్మానంలో..ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ విధానాలకు అందరూ కట్టుబడి ఉండాలని..రెండోది వ్యక్తి పూజ మానుకోవాలి అనే రెండు రాజకీయ తీర్మానాలు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇన్నాళ్లు పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఈ రెండు అంశాల మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సమావేశంలో తీర్మానాలు కూడా ఇవే చేయడంతో రేవంత్ను ఉద్దేశించే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని టాక్. సరిగ్గా ఇదే సమయంకి రేవంత్ రెడ్డి లేకపోవడం తో… వ్యతిరేక శిబిరం ఇలాంటి నిర్ణయాలు చేశారనే రేవంత్ శిబిరంలో చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి…లేకుండా చింతన్ శిబిర్ నిర్వహించడంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం సమావేశం జరిగిందని చెప్తున్నారు నేతలు. ఏఐసీసీ చెప్పినా…రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్ళారా..? నేను లేకుండా సమావేశాల ఎలా జరుగుతాయని చూడాలని అనుకున్నారా?అనే టాక్ ఉంది. పార్టీ సీరియస్గా విధానపరమైన నిర్ణయాలు…వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న సభలో రేవంత్ లేకపోవడంతో రాంగ్ ఇండికేషన్ వెళ్ళినట్లయిందనేది కొంతమంది వాదన.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
రేవంత్ను వ్యతిరేకించే టీం నాయకులే…చింతన్ శిబిర్లో కీలకంగా పని చేయడం…పార్టీలో కొన్ని అనుబంధ సంఘాల నాయకులు కూడా ఒకరిద్దరు సీనియర్ నాయకుల వద్ద రేవంత్ లేకుండా జరిగిన సమావేశాలపై కామెంట్స్ కూడా చేశారు. సమావేశాలు ముగిసిన వెంటనే…చింతన్ శిబిర్ సమావేశ ప్రాంగణంలోనే pac నిర్వహించాలని అనుకున్నారు. ఠాగూర్ హడావుడిగా వెళ్లిపోవడం…Pac సమావేశం రద్దు అవ్వడం…వెనక పెద్ద రాజకీయమే నడిచిందనే టాక్ ఉంది.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!