Telangana Congress : ఆ ఇద్దరి లక్ష్యాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుంపట్లు.. కుమ్ములాటలతో కుదేలవుతున్న కాంగ్రెస్కు హైకమాండ్ చికిత్స మొదలుపెట్టిందా? కొత్త ఇంఛార్జుల రాక వెనక వ్యూహం అదేనా? కొత్తగా వచ్చిన ఇద్దరు నేతల బ్యాక్గ్రౌండ్ ఏంటీ? వారి లక్ష్యాలేంటి? లెట్స్ వాచ్..!
మునుగోడు ఉపఎన్నిక.. కాంగ్రెస్లో అంతర్గత పోరు హీట్ మీద ఉన్న సమయంలో పార్టీ హైకమాండ్ ఇద్దరు AICC కార్యదర్శులను రాష్ట్రానికి పంపింది. గతంలో ఇక్కడ పనిచేసిన AICC కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ వెళ్లిపోవడంతో.. ఆయన ప్లేస్లో ఇద్దరు వచ్చారు. కొత్తగా నదీం జావెద్.. రోహిత్ చౌదరిలను ఎంపిక చేసి.. తెలంగాణకు పంపడం వెనక పార్టీ పరంగా పెద్ద వ్యూహమే ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
నదీం.. రోహిత్ ఇద్దరూ గతంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీతో కలిసి పనిచేశారు. ప్రియాంక కోటరీలో నమ్మకస్తులుగా ముద్ర ఉంది. సమన్వయ కర్తలుగా సమర్థంగా పనిచేస్తారని రాహుల్ గాంధీకి కూడా గురి ఉందట. వీరిద్దరికీ ప్రియాంక, రాహుల్ గాంధీలు 45 రోజులు గడువు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అగ్రనేతలు స్వయంగా ఎంట్రీ ఇచ్చి.. AICC కార్యదర్శులను హైదరాబాద్లో ల్యాండ్ చేయించారని టాక్.
తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఎవరు చెప్పేది నిజం? గ్రౌండ్లో పరిస్థితి ఏంటి? అనే అంశాలపై ఇద్దరు AICC కార్యదర్శులు నదీం.. రోహిత్లు హైకమాండ్కు నివేదికలు ఇస్తారని సమాచారం. ఈ విషయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారట. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు నేతలు.. పని కూడా మొదలుపెట్టేశారు. PJR కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుతో నదీంజావెద్ భేటీ అయ్యారు. కొద్దిరోజులుగా విష్ణు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆపై పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీతోనూ నదీం జావెద్ సమావేశం అయ్యారు. పార్టీ వ్యవహారాలు.. అంతర్గత అంశాలు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పనితీరుపై నదీం ఆరా తీస్తున్నారట.
మరో AICC కార్యదర్శి రోహిత్ చౌదరి సైతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఆకళింపు చేసుసుకునే పనిలో పడ్డారు. త్వరలోనే ఫీల్డ్ ఎంట్రీ ఇస్తారట. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉంది హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఇక్కడి వ్యవహారాలను ప్రియాంకా గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తారని చర్చ జరుగుతోంది. అందుకే ఆమె టీమ్లో కీలకంగా ఉన్న ఇద్దరిని తెలంగాణ పంపినట్టు చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితితోపాటు.. పార్టీ నేతల్లో ఎవరేంటి? వివాదాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ ఎందుకు పుంజుకోలేదు? 2014, 2018 ఎన్నికల ఫలితాలు.. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు. పీసీసీకి కొత్త సారథ్యం వచ్చాక జరిగిన కార్యక్రమాలు.. నేతల అలకలు.. అసంతృప్తులు.. ఆరోపణలు.. విమర్శలపైనా ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్లో ఈ పంచాయితీలు ఏంటి? వీటి వెనక ఎవరు ఉన్నారు? ఇలా అన్ని అంశాలను 45 రోజుల్లో వడపోసి.. పూర్తి స్థాయి అధ్యయనం నివేదికను హైకమాండ్కు అందజేస్తారట. అందుకే తెలంగాణ కాంగ్రెస్లో రానున్న 45 రోజులు అందరిపైనా ఫోకస్ ఉంటుందని.. అందరి జాతకాలు ప్రియాంకా గాంధీ దూతల చేతికి చిక్కినట్టేనని లెక్కలేస్తున్నారు. మరి.. అధిష్ఠానం చేపట్టిన ఈ చికిత్స పార్టీకి ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!