గులాబీ నేతల మౌనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్లో ఆ నేతల మౌనం వెనక మతలబు ఏంటి? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేసే పనిలో ఉన్నారా? సమయం.. సందర్భం చూసి అడుగులు వేస్తారా? ఎవరా నాయకులు?
మూడేళ్లయినా లోకల్ ఎమ్మెల్యేతో గ్యాప్
2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయ్యారు. ఆ అంశంపై అధికార టీఆర్ఎస్ .. విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు.. అప్పటికే టీఆర్ఎస్లో ఉన్న స్థానిక నాయకులకు మధ్య నిప్పు రాజుకుంది. ఎన్నికలు జరిగి మూడేళ్లయినా.. ఆ గ్యాప్ పూడలేదు.
Also Read
అసంతృప్త నేతలతో కలిగే నష్టం ఏంటి?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన కొత్తగూడెం, కొల్లాపూర్, మహేశ్వరం, నకిరేకల్తోపాటు ఒకటి.. రెండు నియోజకవర్గాల టీఆర్ఎస్లో అలజడి మొదలైంది. కొత్త, పాత పార్టీ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు మొదలై.. నిత్యం కుంపట్లు రాజుకుంటున్నాయి. వాటిపై పార్టీలో పంచాయితీలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. పార్టీ పెద్దలు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. అక్కడి పరిణామాల ప్రభావం ఏంటి? రాజకీయ రచ్చ తప్పదా? అసంతృప్త వర్గాలతో కలిగే నష్టంపై చర్చ జరుగుతోంది.
తమ ముందున్న ఆప్షన్లపై వడపోతలు
నకిరేకల్లో వేముల వీరేశం, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిలు ప్రస్తుతం సైలెంట్. ఎవరికి వాళ్లు నియోజకవర్గాలలో తమ గ్రూప్తో టచ్లో ఉంటూ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్నట్టు సమాచారం. రాజకీయ భవిష్యత్తుపైనా ఆలోచనలు చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. సమయం.. సందర్భం చూసుకుని పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే తమ ముందున్న ఆప్షన్లలో లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ భవిష్యత్ను దిద్దుకునే పనిలో నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల లోకల్ ఎమ్మెల్యేతో విభేదించి అనుచరులను గెలిపించుకున్నారు. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడినప్పటికీ.. ఆ ప్రయత్నాలకు పార్టీ పెద్దల ముందు మార్కులు పడలేదని సమాచారం. దీంతో చివరి వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే పొలిటికల్ ఫ్యూచర్ను దిద్దుకునే పనిలో పడ్డారట నాయకులు. మరి.. వారి ఎత్తుగడలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!