TDP :కోవూరు టీడీపీలో ఆధిపత్య పోరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా ఒక సీటు ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొనడంతో కేడర్లోనూ ఆ చీలిక వచ్చేసింది. అదే కోవూరు తెలుగు తమ్ముళ్లను టెన్షన్ పెడుతోందట.
గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. హైదరాబాద్లో స్థిరాస్థి వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే తరచూ కోవూరుకు వస్తున్నారు. 2004లో టీడీపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు పోలంరెడ్డి. 2009లో ఓడిపోయారు. 2014లో టీడీపీలో చేరి అదే ప్రసన్నకుమార్రెడ్డిపై మళ్లీ గెలిచారు. 2019కి వచ్చే సరికి మళ్లీ సీన్ రివర్స్. ఇక్కడ పార్టీ నేతలతో పొసగక కోవూరుకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పోలంరెడ్డి గేర్ మార్చేశారు. ఇదే సమయంలో పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి కోవూరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గతంలో ఛాన్స్ మిస్ అయినా ఈ దఫా అలా జరగదనే గట్టి నమ్మకంతో ఉన్నారట. పైగా ఇటీవల నెల్లూరు వచ్చిన చంద్రబాబు ప్రత్యేకంగా పెళ్లకూరు ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. పైగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మద్దతు కూడా పెళ్లకూరుకే ఉంది.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సైతం కోవూరుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసి నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరితో కాకుండా.. టీడీపీ కార్యక్రమాలను సొంతంగా చేపడుతున్నారు చేజర్ల. ప్రస్తుతం కోవూరులో పోలంరెడ్డికో టీడీపీ ఆఫీసు.. చేజర్లకు మరో టీడీపీ ఆఫీసు ఉన్నాయి. పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి మాత్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆఫీసు నుంచి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ముగ్గురు నేతలూ ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కేడర్ను గందరగోళంలోకి నెడుతోందట. ప్రస్తుతానికి తెరవెనక వేస్తున్న ఎత్తుగడలు.. రేపటి రోజున రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. మరి.. టీడీపీ పెద్దలు కోవూరులో ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఇంకెవరిని బుజ్జగిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?