TDP :కోవూరు టీడీపీలో ఆధిపత్య పోరు..!
నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా ఒక సీటు ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొనడంతో కేడర్లోనూ ఆ చీలిక వచ్చేసింది. అదే కోవూరు తెలుగు తమ్ముళ్లను టెన్షన్ పెడుతోందట.
గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. హైదరాబాద్లో స్థిరాస్థి వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే తరచూ కోవూరుకు వస్తున్నారు. 2004లో టీడీపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు పోలంరెడ్డి. 2009లో ఓడిపోయారు. 2014లో టీడీపీలో చేరి అదే ప్రసన్నకుమార్రెడ్డిపై మళ్లీ గెలిచారు. 2019కి వచ్చే సరికి మళ్లీ సీన్ రివర్స్. ఇక్కడ పార్టీ నేతలతో పొసగక కోవూరుకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పోలంరెడ్డి గేర్ మార్చేశారు. ఇదే సమయంలో పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి కోవూరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గతంలో ఛాన్స్ మిస్ అయినా ఈ దఫా అలా జరగదనే గట్టి నమ్మకంతో ఉన్నారట. పైగా ఇటీవల నెల్లూరు వచ్చిన చంద్రబాబు ప్రత్యేకంగా పెళ్లకూరు ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. పైగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మద్దతు కూడా పెళ్లకూరుకే ఉంది.
Also Read
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సైతం కోవూరుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసి నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరితో కాకుండా.. టీడీపీ కార్యక్రమాలను సొంతంగా చేపడుతున్నారు చేజర్ల. ప్రస్తుతం కోవూరులో పోలంరెడ్డికో టీడీపీ ఆఫీసు.. చేజర్లకు మరో టీడీపీ ఆఫీసు ఉన్నాయి. పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి మాత్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆఫీసు నుంచి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ముగ్గురు నేతలూ ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కేడర్ను గందరగోళంలోకి నెడుతోందట. ప్రస్తుతానికి తెరవెనక వేస్తున్న ఎత్తుగడలు.. రేపటి రోజున రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. మరి.. టీడీపీ పెద్దలు కోవూరులో ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఇంకెవరిని బుజ్జగిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!