TDP :కోవూరు టీడీపీలో ఆధిపత్య పోరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా ఒక సీటు ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొనడంతో కేడర్లోనూ ఆ చీలిక వచ్చేసింది. అదే కోవూరు తెలుగు తమ్ముళ్లను టెన్షన్ పెడుతోందట.
గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. హైదరాబాద్లో స్థిరాస్థి వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే తరచూ కోవూరుకు వస్తున్నారు. 2004లో టీడీపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు పోలంరెడ్డి. 2009లో ఓడిపోయారు. 2014లో టీడీపీలో చేరి అదే ప్రసన్నకుమార్రెడ్డిపై మళ్లీ గెలిచారు. 2019కి వచ్చే సరికి మళ్లీ సీన్ రివర్స్. ఇక్కడ పార్టీ నేతలతో పొసగక కోవూరుకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పోలంరెడ్డి గేర్ మార్చేశారు. ఇదే సమయంలో పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి కోవూరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గతంలో ఛాన్స్ మిస్ అయినా ఈ దఫా అలా జరగదనే గట్టి నమ్మకంతో ఉన్నారట. పైగా ఇటీవల నెల్లూరు వచ్చిన చంద్రబాబు ప్రత్యేకంగా పెళ్లకూరు ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. పైగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మద్దతు కూడా పెళ్లకూరుకే ఉంది.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సైతం కోవూరుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసి నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరితో కాకుండా.. టీడీపీ కార్యక్రమాలను సొంతంగా చేపడుతున్నారు చేజర్ల. ప్రస్తుతం కోవూరులో పోలంరెడ్డికో టీడీపీ ఆఫీసు.. చేజర్లకు మరో టీడీపీ ఆఫీసు ఉన్నాయి. పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి మాత్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆఫీసు నుంచి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ముగ్గురు నేతలూ ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కేడర్ను గందరగోళంలోకి నెడుతోందట. ప్రస్తుతానికి తెరవెనక వేస్తున్న ఎత్తుగడలు.. రేపటి రోజున రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. మరి.. టీడీపీ పెద్దలు కోవూరులో ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఇంకెవరిని బుజ్జగిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
-
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్పై చరణ్ క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?