కమలంలో ఉన్న మాజీ టీడీపీ నేతల అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్ కాలేదని భావిస్తున్నారట.
కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తోంది.
Also Read
తెలంగాణ బీజేపీలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక చేరికలు జరిగాయి. ఇందులో ప్రముఖ నేతలతో పాటు, ఎదుగుతున్న నేతలు కూడా అనేకమంది ఉన్నారు. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. అయితే, పార్టీ మారేటపుడు నేతలు కొన్ని హామీలతో కండువాలు కప్పుకుంటారు.
కమలం పార్టీలో చేరి చాలా కాలమైనా ఇంకా తమకు న్యాయం జరగలేదని కొందరు నేతలు భావిస్తున్నారట
ముఖ్యంగా టిడిపి నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం వారిలో తమకు పదవుల విషయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉందట పార్టీ సంబంధించిన కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదట పెద్ద ప్రోగ్రాం ఉన్నా ఎవరో చెబితే కానీ తెలియడం లేదట. రీసెంట్ గా మాజీ మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తి ని బహిరంగంగా నే వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితి ల నేపథ్యం లో ప్రస్తుతం కామ్ గా ఉన్నా, భవిష్యత్తు లో ఆయన పార్టీ లో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… టియ్యారెస్ లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరో నేత మోత్కుపల్లిని సీఎం సమావేశానికి వెళ్ళొద్దని పార్టీ చెప్పినా ఆయన మాత్రం వెళ్ళారు. ఇప్పటికే కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా, అసంతృప్తి మాత్రం తీవ్రంగానే ఉందట. అటు దేవేందర్ గౌడ్ కుమారులు బీజేపీ లోనే ఉన్నా… ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది… వీరేందర్ గౌడ్ కి పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే అభిప్రాయాలున్నాయి
మాజీ ఎంపీ గరిక పాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు…గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఆయన లేరనే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఆయన తో పాటు పార్టీ లో చేరిన వారిలో మరి కొందరు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కమలం తీర్థం కొందరికి మాత్రమే సరిపడిందని, చాలామందికి వంటబట్టలేదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. పార్టీలో ఇమడలేని పరిస్థితి వస్తోందని భావిస్తున్నారట. ఈ పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో కమల దళం నుండి బయటకు వెళ్లే నేతలు ఎవరా అనే చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!