కమలంలో ఉన్న మాజీ టీడీపీ నేతల అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్ కాలేదని భావిస్తున్నారట.
కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తోంది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తెలంగాణ బీజేపీలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక చేరికలు జరిగాయి. ఇందులో ప్రముఖ నేతలతో పాటు, ఎదుగుతున్న నేతలు కూడా అనేకమంది ఉన్నారు. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. అయితే, పార్టీ మారేటపుడు నేతలు కొన్ని హామీలతో కండువాలు కప్పుకుంటారు.
కమలం పార్టీలో చేరి చాలా కాలమైనా ఇంకా తమకు న్యాయం జరగలేదని కొందరు నేతలు భావిస్తున్నారట
ముఖ్యంగా టిడిపి నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం వారిలో తమకు పదవుల విషయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉందట పార్టీ సంబంధించిన కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదట పెద్ద ప్రోగ్రాం ఉన్నా ఎవరో చెబితే కానీ తెలియడం లేదట. రీసెంట్ గా మాజీ మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తి ని బహిరంగంగా నే వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితి ల నేపథ్యం లో ప్రస్తుతం కామ్ గా ఉన్నా, భవిష్యత్తు లో ఆయన పార్టీ లో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… టియ్యారెస్ లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరో నేత మోత్కుపల్లిని సీఎం సమావేశానికి వెళ్ళొద్దని పార్టీ చెప్పినా ఆయన మాత్రం వెళ్ళారు. ఇప్పటికే కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా, అసంతృప్తి మాత్రం తీవ్రంగానే ఉందట. అటు దేవేందర్ గౌడ్ కుమారులు బీజేపీ లోనే ఉన్నా… ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది… వీరేందర్ గౌడ్ కి పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే అభిప్రాయాలున్నాయి
మాజీ ఎంపీ గరిక పాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు…గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఆయన లేరనే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఆయన తో పాటు పార్టీ లో చేరిన వారిలో మరి కొందరు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కమలం తీర్థం కొందరికి మాత్రమే సరిపడిందని, చాలామందికి వంటబట్టలేదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. పార్టీలో ఇమడలేని పరిస్థితి వస్తోందని భావిస్తున్నారట. ఈ పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో కమల దళం నుండి బయటకు వెళ్లే నేతలు ఎవరా అనే చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!