Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Mafia In East Godavari

తూర్పుగోదావరి జిల్లాలో మాఫియా కోరలు..!

Published Date :December 25, 2021 , 12:18 pm
By Manohar
తూర్పుగోదావరి జిల్లాలో మాఫియా కోరలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ జిల్లాలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ఓ పెద్ద మాఫియా. పురాతన బౌద్ధ మహాస్థూపం ఉన్న కొండపై మైనింగ్‌ గెద్దల కన్ను పడింది. కొండను తవ్వి గుల్ల చేయడానికి రంగం చేస్తోంది. సొంత జేబులు నింపుకోవడానికి చరిత్రను మాయం చేసేలా కుట్రలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు?

చారిత్రక కొండను తవ్వి మట్టి తరలించేలా మాఫియా ఎత్తుగడ..!

ఇది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ. దాదాపు 330 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతం. ఎంతో చరిత్ర ఈ కొండల్లో నిక్షిప్తం. అలాంటి చరిత్రను చెరిపేసే పని మొదలుపెట్టింది మైనింగ్‌ మాఫియా. ఆలోచన వచ్చిందే తడవుగా కొండను తవ్వి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. కొండను తవ్వి ఎర్ర మట్టి.. లైట్రేట్‌ను తరలించేందుకు.. భారీగా సొమ్ము చేసుకునేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని చెబుతున్నారు.

చిత్తూరు, గుంటూరు, విజయవాడ, మేడపాడులకు చెందిన వాళ్లకు ఎన్‌వోసీ..?
కోర్టు తలుపు తట్టిన స్థానిక రైతులు..!

కొండను తవ్వుకునేందుకు ఈ ఏడాది జూలైలో చిత్తూరు, గుంటూరు, విజయవాడ, సామర్లకోట మండలం జి. మేడపాడులకు చెందిన నలుగురికి NOC ఇచ్చేలా కొడవలి పంచాయతీ తీర్మానం చేసింది. సెప్టెంబర్‌లో రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు ఎంట్రీ ఇచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఓకే చెప్పడానికి సిద్ధ పడ్డాయి. ఇంతలో ఆ కొండపై అనేక ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు కోర్టు తలుపు తట్టడంతో కథ అడ్డం తిరిగింది. మైనింగ్‌ గురించి తెలుసుకుని పురావస్తు శాఖ అధికారులు సీన్‌లోకి వచ్చారు. కొండను తవ్వకుండా చర్యలు తీసుకోవాలిన గొల్లప్రోలు తహశీల్దారుకు లేఖ ఇచ్చారు. మైనింగ్‌ మాఫియా మాత్రం ప్రభుత్వంలోని పెద్దలతో తమకున్న పరిచయాలను ఇక్కడ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందట. దీంతో ఏ క్షణమైనా అనుమతులు రావొచ్చని.. మొదటలో ఐదెకరాలకు అనుమతి తీసుకుని క్రమంగా కొండను కొల్లగొడతారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

2,3 శతాబ్దాలకు చెందిన బౌద్ధ కట్టడాలు ఉన్న కొండ..!
రాణిని గుర్తు చేసుకుంటూ కొడవలి పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధి..!

తెలుగు రాష్ట్రాల్లోని పురాతన బౌద్ధ క్షేత్రాల్లో కొడవలి ఒకటి. మౌర్య అశోకుడితో ముడిపడి ఉన్న ప్రాంతంగా చెబుతారు. 2 లేదా మూడో శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ స్తూపం నిర్మించారని చరిత్రకారుల మాట. శాతవాహన రాణి అయిన కొడవలి శిరి ఎన్నో ధాన ధర్మాలు చేసి.. బౌద్ధ భిక్షువులకు గదులు.. నీటి వసతికి బావులు, స్తూపాలు నిర్మించారని ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్లు వివరిస్తారు. అందువల్లే ఈ ప్రాంతానికి రాణి పేరు అయిన కొడవలి స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. ఇప్పుడు మైనింగ్‌ మాఫియా అడుగులు పడితే ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.

330 ఎకరాలు విస్తరించిన కొండ.. రూ.100-200 కోట్లు వెనకేసుకునే యత్నం?

బలమైన రాజకీయ ప్రాంతాల నుంచి మైనింగ్‌కు దరఖాస్తు చేయడంతో.. రేపటి రోజున ఏదైనా జరగొచ్చని అనుకుంటున్నారు. దాదాపు 330 ఎకరాల్లో విస్తరించిన కొండను తవ్వితే వంద నుంచి రెండొందల కోట్ల వరకు మాఫియా వెనకేసుకోవచ్చని అంచనా. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చేది కొంతే అయినా.. చరిత్ర మాయమై.. మైనింగ్‌ కోరల్లో ధనకొండ చిక్కుకునే ప్రమాదం ఉంది. మరి.. మైనింగ్‌ మాట చెల్లుతుందో.. చారిత్రక కొండ నిలుస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • andhrapradesh
  • east godavari
  • Mafia

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions