ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో అనుమానిస్తున్నదే జరిగిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీళ్లు అనుమానిస్తున్నదే అక్కడ జరిగిందా? తీగ లాగితే డొంక బయట పడుతుందనే భయం మొదలైందా? అందుకే తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇది వారి ఆలోచనా.. లేక వారి వెనకున్న వారి ఆలోచనా? తప్పించుకునేందుకు ఆదిలోనే తోవలు వెతుకుతున్నారా?
నిధుల గోల్మాల్ వెనకున్న పెద్దలు బయటకొస్తారనే ‘రాజీ’ ప్రయత్నాలు?
Also Read
జగన్ ప్రభుత్వం నాటి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు తవ్వే పని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఒకటొకటిగా దర్యాప్తు చేయడం.. కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల గోల్మాల్ ఒకటి. విచారణ జరిగితే వ్యక్తులు.. దాని వెనకున్న అప్పటి పెద్దలు బయటకు వస్తారని అనుకున్నారో ఏమో.. రాజీ ప్రయత్నాలు తెరపైకి తెస్తున్నారట.
రూ. 241 కోట్లు షెల్ కంపెనీల్లోకి మళ్లించారా?
‘రాజీ’ కోసం ప్రభుత్వ పెద్దలను కలిసే యత్నం?
యువతకు నైపుణ్యాలు కల్పించే ఉద్దేశంతో.. సీమెన్స్ అనే సంస్థ కార్పొరేట్ ఫండ్ కింద ముందుకు వచ్చింది. ఈ సంస్థ 90 శాతం నిధులు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 10 శాతం అంటే సుమారుగా 370 కోట్ల 78 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చింది. ప్రాజెక్టు అమలు సమయంలో మౌలిక సదుపాయాలు, లాబ్లు, సాఫ్ట్వేర్, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు విడుదలైన సొమ్ములో సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలు నిధులు పక్కదారి పట్టించాయన్నది ఆరోపణ. ఇలా మొత్తం 241 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల్లోకి మళ్లించారని ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలెప్మెంట్ సంస్థ చేయించిన ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. ఆ విధంగా APSSDC సిఫారసు CID చేతికి వెళ్లింది. దాంతో డిజైన్టెక్ సంస్థ ప్రతినిధులు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని అమరావతి వర్గాల్లో టాక్.
Read: ఆంధ్రాలో థియేటర్స్ రీఓపెన్… రిలీజ్ కు సిద్ధంగా సినిమాలు
ఎవరో డైరెక్షన్తో డిజైన్టెక్ బృందం రంగంలోకి దిగిందా?
సీమెన్స్ ప్రాజెక్టుపై అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో.. చాలా మంది నాయకులు, అధికారుల పేర్లు బయటకు వస్తాయని APSSDC పెద్దలు చెబుతున్నారు. అందుకే డిజైన్టెక్ బృందం ఎవరో డైరెక్షన్తో రంగంలోకి దిగినట్టు అనుమానిస్తున్నారు. అంతా అనుకుంటున్నట్టు.. అనుమానిస్తున్నట్లే జరిగి ఉంటే పెద్ద చేపలు చిక్కినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది. పక్కా దర్యాప్తుతో పక్కాగా బుక్ అవుతాం అనుకున్న వారి డైరెక్షన్లో డిజైన్టెక్ ఎంట్రీ ఇస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. మిగిలిన చాలా కేసుల్లో జరిగిన రాజీ యత్నాలు ఇక్కడ జరుగుతుండటంతో.. అసలు విషయం గట్టిగానే ఉన్నట్టు భావిస్తున్నారు.
తప్పు చేయకపోతే ‘రాజీ’ ప్రయత్నాలు ఎందుకు?
తప్పు చేయకపోతే రాజీ ప్రయత్నాలు చేయటం ఎందుకు అని APSSDC వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జరిగింది ఏంటో.. షెల్ కంపెనీలకు నిధులు మళ్లాయో లేదో సీఐడీ విచారణలో తేలిపోతుంది కదా.. అలా కాకుండా మా వాదన వినండి అని ప్రభుత్వాన్ని పెద్దలను కలిసే ప్రయత్నం చేయటం రాజకీయాలు చేయటానికే అని చెబుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఈ కేసులో బయటపడే పెద్ద తలకాయలు ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!