అనకాపల్లి మెడికల్ కాలేజీపై వైసీపీలో చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో యువ ఎమ్మెల్యే. రాజకీయ ఉద్ధండులకు దక్కని అవకాశం లభించింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాధించామని సంబరాలు చేసుకుంది ఎమ్మెల్యే వర్గం. అంతా ఓకే అనుకున్న వేళ కిరికిరి మొదలైంది. దీంతో ఉపేక్షించకూదని భావిస్తున్న ఆ యువ ఎమ్మెల్యే.. తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.
అట్టహాసంగా మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
విశాఖ జిల్లా రాజకీయాల్లో అనకాపల్లిది సెపరేట్ స్టైల్. ఇక్కడ పాలిటిక్స్ అన్నీ సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావ్, గంటా శ్రీనివాస్ వంటి ఉద్ధండులు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ కొనసాగుతున్నారు. తన నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారు అమర్నాథ్. గ్రామీణ ప్రాంతంలో నివశిస్తున్న లక్షలమంది ప్రజలు.. వైద్య అవసరాల కోసం విశాఖపైనే ఆధారపడాల్సి వస్తోంది. అదే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనకాపల్లిలో ఏర్పాటైతే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ గతఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యరూపంలో పెట్టారు. ఇటీవల శంఖుస్థాపనలు అట్టహాసంగా జరిగాయి.
also read : ఏపీ కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే ?
వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని 50 ఎకరాలు కేటాయింపు
అనకాపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 500 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుండగా.. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని 50 ఎకరాలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఇక్కడి వరకు అంతా సాఫీగానే జరిగింది. ఆస్పత్రి నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంపై ఇప్పుడు వివాదం మొదలైంది. వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఓ సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు. యధాతథస్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఆస్పత్రికి భూమిని కేటాయించొద్దని కోర్టులో పిటిషన్
వాస్తవానికి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇప్పటి వరకు 32 చెరకు వంగడాలపై ప్రయోగాలు జరిగాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పరిశోధన కేంద్రం భూములను ఆస్పత్రికి కేటాయించ వద్దని కోర్టులో వేసిన పిటిషన్లో కోరారు. నిజానికి ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో తీసుకునే భూమికి ప్రత్యామ్నాయంగా పట్టణ శివార్లలో భూమిని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. అయితే అంతర్గత రాజకీయాల్లో భాగంగానే కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని గట్టిగా నమ్ముతోంది ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వర్గం.
అనకాపల్లి వైసీపీలో మూడు గ్రూపులు
రాజకీయ ఎత్తుగడలే వివాదానికి కారణమా?
ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరిగితే తమకు ఎక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుందనే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది. అనకాపల్లి రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ సత్యవతి గ్రూపులు ఉన్నాయి. వీరంతా పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసినప్పటికీ వ్యక్తిగత మైలేజ్ దగ్గరకు వచ్చేసరికి రాజీపడటం లేదు. ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించిన భూములపై వివాదం రాజుకోవడానికి స్థానిక రాజకీయ ఎత్తుగడలే కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పేర్లు ప్రస్తావించకుండా ఎమ్మెల్యే ఘాటైన కామెంట్స్
ఈ పరిణామాలపై ఎమ్మెల్యే అమర్నాథ్ తీవ్ర అసహనంతో ఉన్నారట. పేర్లు ప్రస్తావించకుండానే బహిరంగ వేదికలపై ఘాటైన కామెంట్స్ చేస్తున్నారట. రాజకీయ ఎత్తుగడలు బహిరంగ రహస్యమే కనుక మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయంలో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ అంశంపై తాడేపల్లిలోనే తాడోపేడో తేల్చుకోవడానికి అమర్నాథ్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
-
Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
-
No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
-
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!