ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు….
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న పోలీసులకు వివిధ వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాలో మాత్రం కొందరు చేస్తున్న పనులు డిపార్ట్మెంట్కు మింగుడు పడటం లేదట. మరక తెస్తున్న బ్లాక్షీప్లను పట్టుకునే పనిలో పడ్డారట ఉన్నతాధికారులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సిబ్బంది తీరుతో అధికారులకు తలనొప్పి!
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అక్కడి అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఒకదాని వెనక ఏదో ఒక విమర్శలు రావడం.. ఆరోపణలు వచ్చినవారిపై వేటు వేయడం పరిపాటిగా మారిపోయిందని చెబుతున్నారు. కరోనా సమయంలో మిగిలిన ప్రదేశాల్లో పోలీసులు మంచిపేరు తెచ్చుకుంటే.. ఇక్కడ మాత్రం ఈ తలనొప్పి ఏంటని ఉన్నతాధికారులు తలపట్టుకున్న సందర్భాలు ఉన్నాయట.
నిందితుడికి రాచమర్యాదలు చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు
నెలరోజుల కిందట హస కొత్తూరు గ్రామంలో సిద్దార్థ అనే యువకుడి హత్య జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సిబ్బందితో ఉన్న పాత పరిచయాల కారణంగా నిందితుడికి రాచమర్యాదలు చేశారట. వాటికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లుపై వేటు వేశారు. ఈ ఘటన తర్వాత విచారణకు వచ్చిన పోలీసులను గ్రామశివారుల్లోనే అడ్డుకున్నారు స్థానికులు.
ఇందల్వాయి ఎస్ఐపై ఆరోపణలు.. వేటు!
ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్పై వచ్చిన ఆరోపణలు మరో ఎత్తు. ఓ మహిళా కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు ఎస్ఐ కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు శివప్రసాద్పై వేటు వేశారు. కేసూ నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లాలో ఇసుక లారీల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ కొందరు పోలీసులు అడ్డంగా బుక్కయిపోయారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు కానిస్టేబుళ్లపై వేటు వేశారు జిల్లా ఎస్పీ.
సస్పెండైన కానిస్టేబుళ్ల వెనక ఉన్నవారి పరిస్థితి ఏంటి?
ఇవన్నీ కేవలం బయటకు తెలిసి.. విచారణ జరిపి చర్యలు తీసుకున్న ఉదంతాలు. బయటకు రాకుండా డిపార్ట్మెంట్లో చాలా మంది బ్లాక్షీప్లు ఉన్నట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారట. వారి చిట్టా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇటీవల సస్పెండైన కానిస్టేబుళ్లు వెనక కొందరు అధికారుల పాత్రను గుర్తించారట. వారిపై చర్యలు తీసుకుంటారా.. మందలించి వదిలిపెడతారా అన్నది తెలియాలి.
డీజీపీ ప్రత్యేకంగా నిఘా పెట్టారా?
తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే జనాల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందనే అభిప్రాయం కొందరు ఉన్నాతాధికారుల్లో ఉందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ యంత్రాంగంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై డీజీపీ సైతం నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా కొన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అక్రమార్కుల్లో గుబులు మొదలైందట. మరి.. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!