Off The Record: పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- ఢిల్లీలో రాహుల్ గాంధీ, మహేష్ గౌడ్ ప్రత్యేక భేటీ
- అర్ధగంట మీటింగ్లో ఏం జరిగిందంటూ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ
- పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- లీడర్స్, కేడర్కు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయా?
- పక్క రాష్ట్రంలోని ఓ నేతలా పార్టీని నడపాలని సూచించారా?
- అధికారం ఉన్నచోట ఇంకా బలమైన నిర్మాణం జరగాలన్న అభిప్రాయం
- పదవులు రాలేదన్న నిరాశలో రాష్ట్ర నాయకులు
- ముందు నామినేటెడ్ పోస్ట్లను భర్తీ చేస్తే కదలిక వస్తుందన్న ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్… ఢిల్లీలో రాహుల్ గాంధీతో సుమారు అర గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. రాష్ట్రం నుంచి వెళ్లిన పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రాహుల్ని కలిసినా…. స్టేట్ పార్టీ చీఫ్కు ముఖ్యనేత ఏం చెప్పారన్న అంశం చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఆ భేటీలో ఏం చర్చ జరిగింది…? రాహుల్ గాంధీ ఆదేశాలు ఏంటి..? వాటి ప్రకారం మహేష్ గౌడ్ ఇక రంగంలోకి దిగుతారా..? స్పీడ్ పెంచుతారా అన్న చర్చలు మొదలయ్యాయి రాష్ట్ర రాజకీయవర్గాల్లో.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్టీ నిర్మాణం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట రాహుల్. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వం బలోపేతం, క్యాడర్ స్థితిగతుల్ని తెలుసుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. తెలంగాణలో పార్టీ నిర్మాణం మీద సరిగ్గా ఫోకస్ చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓబీసీ అజెండాతో పాటు.. అనుకున్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరగడం లేదనే ఫీడ్ బ్యాక్ ఏఐసీసీకి ఉందట. దానితో పాటు పార్టీ క్యాడర్, నాయకులకు సంబంధించిన అంశాలను కూడా ఇద్దరూ ఆ అర్ధగంట మీటింగ్లో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రంలోని ఓ నాయకుడి లేరు ప్రస్తావించి మరీ.. క్యాడర్ని, పార్టీని అలా ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ సూచించినట్టు తెలిసింది.
Also Read
ఈ మధ్యకాలంలో పూర్తిగా పార్టీ నిర్మాణంపైనే పనిచేస్తున్నారట రాహుల్. అందులో భాగంగానే డీసీసీల నియామకం ఆయన నిర్ణయించినట్టుగానే జరిగింది. ఐతే పార్టీ.. తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి.. ఇంకాస్త బలమైన నిర్మాణంతో పాటు క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాలని సూచించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయినా… ఇంకా తమకు సరైన ఆదరణ దక్కడం లేదంటూ కార్యకర్తలు కొంత నిరాశలోనే ఉన్నారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ఒక రకంగా ఇది పార్టీకి సవాలేనని అంటున్నారు. వెంటనే నామినేట్ పోస్టులు భర్తీ చేస్తే.. ఎంతోకొంత కదలిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి చాలా అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీంతో.. కీలకమైన వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ చెప్పాల్సింది చెప్పేశారు. ఇక రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎలా ముందడుగు వేస్తుంది..? నిర్మాణంపై ఫోకస్ చేస్తుందా..? లేదా అనేది చూడాలంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.
తాజావార్తలు
-
Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!
-
Welcome To The Jungle : బికినీ సీన్లకు సెన్సార్ బ్రేక్… ‘వెల్కమ్ టు ది జంగిల్’ రిలీజ్కు ముందే 18 కత్తెరలు..
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!