Off The Record: పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- ఢిల్లీలో రాహుల్ గాంధీ, మహేష్ గౌడ్ ప్రత్యేక భేటీ
- అర్ధగంట మీటింగ్లో ఏం జరిగిందంటూ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ
- పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- లీడర్స్, కేడర్కు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయా?
- పక్క రాష్ట్రంలోని ఓ నేతలా పార్టీని నడపాలని సూచించారా?
- అధికారం ఉన్నచోట ఇంకా బలమైన నిర్మాణం జరగాలన్న అభిప్రాయం
- పదవులు రాలేదన్న నిరాశలో రాష్ట్ర నాయకులు
- ముందు నామినేటెడ్ పోస్ట్లను భర్తీ చేస్తే కదలిక వస్తుందన్న ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్… ఢిల్లీలో రాహుల్ గాంధీతో సుమారు అర గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. రాష్ట్రం నుంచి వెళ్లిన పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రాహుల్ని కలిసినా…. స్టేట్ పార్టీ చీఫ్కు ముఖ్యనేత ఏం చెప్పారన్న అంశం చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఆ భేటీలో ఏం చర్చ జరిగింది…? రాహుల్ గాంధీ ఆదేశాలు ఏంటి..? వాటి ప్రకారం మహేష్ గౌడ్ ఇక రంగంలోకి దిగుతారా..? స్పీడ్ పెంచుతారా అన్న చర్చలు మొదలయ్యాయి రాష్ట్ర రాజకీయవర్గాల్లో.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్టీ నిర్మాణం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట రాహుల్. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వం బలోపేతం, క్యాడర్ స్థితిగతుల్ని తెలుసుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. తెలంగాణలో పార్టీ నిర్మాణం మీద సరిగ్గా ఫోకస్ చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓబీసీ అజెండాతో పాటు.. అనుకున్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరగడం లేదనే ఫీడ్ బ్యాక్ ఏఐసీసీకి ఉందట. దానితో పాటు పార్టీ క్యాడర్, నాయకులకు సంబంధించిన అంశాలను కూడా ఇద్దరూ ఆ అర్ధగంట మీటింగ్లో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రంలోని ఓ నాయకుడి లేరు ప్రస్తావించి మరీ.. క్యాడర్ని, పార్టీని అలా ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ సూచించినట్టు తెలిసింది.
Also Read
ఈ మధ్యకాలంలో పూర్తిగా పార్టీ నిర్మాణంపైనే పనిచేస్తున్నారట రాహుల్. అందులో భాగంగానే డీసీసీల నియామకం ఆయన నిర్ణయించినట్టుగానే జరిగింది. ఐతే పార్టీ.. తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి.. ఇంకాస్త బలమైన నిర్మాణంతో పాటు క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాలని సూచించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయినా… ఇంకా తమకు సరైన ఆదరణ దక్కడం లేదంటూ కార్యకర్తలు కొంత నిరాశలోనే ఉన్నారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ఒక రకంగా ఇది పార్టీకి సవాలేనని అంటున్నారు. వెంటనే నామినేట్ పోస్టులు భర్తీ చేస్తే.. ఎంతోకొంత కదలిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి చాలా అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీంతో.. కీలకమైన వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ చెప్పాల్సింది చెప్పేశారు. ఇక రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎలా ముందడుగు వేస్తుంది..? నిర్మాణంపై ఫోకస్ చేస్తుందా..? లేదా అనేది చూడాలంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..