రోజా నగరిలో పొలిటికల్ హీట్..భానుతో టచ్ లో వైసీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్లో ఉంటే.. భాను ప్రకాష్ మాత్రం యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారని తెలుగు తమ్ముళ్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. గత ఎన్నికల్లో రెండువేల ఓట్ల తేడాతో భానుప్రకాష్ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం నగరిలో పసుపు జెండా ఎగరేస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారట.
ప్రస్తుతం నగరిలో మంత్రి రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత భాను ప్రకాష్ సైతం బాదుడే బాదుడు అని టూర్ చేస్తున్నారు. నగరిలో 50 వేలకు పైగా ఉండే పవర్ లూమ్ కార్మికులు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. వారికి టీడీపీ మద్దతు ఇవ్వడంతో అది రాజకీయంగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. సరిగ్గా ఇదే టైమ్లో వైసీపీలో రోజా వ్యతిరేకవ్గం భానుప్రకాష్తో టచ్లోకి వెళ్లిందనే ప్రచారం కలకలం రేపుతోంది.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
మంత్రి పదవి రాగానే తన వ్యతిరేకవర్గానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోజా. మీ అంతు తేలుస్తా.. లెక్కలు సరిచేస్తానని చెప్పడంతో రోజా వ్యతిరేకవర్గంలోని కొందరు తమ గేమ్ ప్లాన్ మార్చేసినట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో రోజా ఓటమే లక్ష్యంగా పావులు కదపడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. రోజాకు సొంత పార్టీలో వైరిపక్షంగా ఉన్న అమ్ములుతోపాటు.. వడమాలపేటలోని ఓ నాయకుడు.. మరికొందరు భాను ప్రకాష్తో టచ్లోకి వెళ్లినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. గాలి వారసుడు సైతం.. కొంచెం టచ్లో ఉండండి.. కలిసి పనిచేద్దామని వారికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జోరందుకుంది. ఆ వర్గంతో మాటలు కలిశాకే.. భాను ప్రకాష్ నగరిలో దూకుడు పెంచారని చర్చ సాగుతోంది.
మారిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం నగరి పాలిటిక్స్ను వేడెక్కిస్తున్నాయి. జనంలో పట్టుసాధించేందుకు టీడీపీ.. పట్టు సడలకుండా మంత్రి రోజా వేస్తున్న ఎత్తుగడలు రేపో మాపో ఎన్నికలన్నట్టుగా ఉన్నాయి. ఇందులో రోజా వ్యతిరేకవర్గం కదలికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి.. రానున్న రోజుల్లో నగరి పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.
- Tags
- ap politics
- Minister roja
- Nagari
- tdp
- ycp
తాజావార్తలు
-
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్కు రికార్డ్ వ్యూస్..
-
Astrology: మే 25th సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
-
Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
-
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!