రోజా నగరిలో పొలిటికల్ హీట్..భానుతో టచ్ లో వైసీపీ నేతలు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్లో ఉంటే.. భాను ప్రకాష్ మాత్రం యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారని తెలుగు తమ్ముళ్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. గత ఎన్నికల్లో రెండువేల ఓట్ల తేడాతో భానుప్రకాష్ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం నగరిలో పసుపు జెండా ఎగరేస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారట.
ప్రస్తుతం నగరిలో మంత్రి రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత భాను ప్రకాష్ సైతం బాదుడే బాదుడు అని టూర్ చేస్తున్నారు. నగరిలో 50 వేలకు పైగా ఉండే పవర్ లూమ్ కార్మికులు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. వారికి టీడీపీ మద్దతు ఇవ్వడంతో అది రాజకీయంగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. సరిగ్గా ఇదే టైమ్లో వైసీపీలో రోజా వ్యతిరేకవ్గం భానుప్రకాష్తో టచ్లోకి వెళ్లిందనే ప్రచారం కలకలం రేపుతోంది.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
మంత్రి పదవి రాగానే తన వ్యతిరేకవర్గానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోజా. మీ అంతు తేలుస్తా.. లెక్కలు సరిచేస్తానని చెప్పడంతో రోజా వ్యతిరేకవర్గంలోని కొందరు తమ గేమ్ ప్లాన్ మార్చేసినట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో రోజా ఓటమే లక్ష్యంగా పావులు కదపడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. రోజాకు సొంత పార్టీలో వైరిపక్షంగా ఉన్న అమ్ములుతోపాటు.. వడమాలపేటలోని ఓ నాయకుడు.. మరికొందరు భాను ప్రకాష్తో టచ్లోకి వెళ్లినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. గాలి వారసుడు సైతం.. కొంచెం టచ్లో ఉండండి.. కలిసి పనిచేద్దామని వారికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జోరందుకుంది. ఆ వర్గంతో మాటలు కలిశాకే.. భాను ప్రకాష్ నగరిలో దూకుడు పెంచారని చర్చ సాగుతోంది.
మారిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం నగరి పాలిటిక్స్ను వేడెక్కిస్తున్నాయి. జనంలో పట్టుసాధించేందుకు టీడీపీ.. పట్టు సడలకుండా మంత్రి రోజా వేస్తున్న ఎత్తుగడలు రేపో మాపో ఎన్నికలన్నట్టుగా ఉన్నాయి. ఇందులో రోజా వ్యతిరేకవర్గం కదలికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి.. రానున్న రోజుల్లో నగరి పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.
- Tags
- ap politics
- Minister roja
- Nagari
- tdp
- ycp
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!