Off The Record: రాహుల్ పాదయాత్ర ముగింపు సభ.. బీఆర్ఎస్ను ఎందుకు పిలవలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెద్ద కార్యక్రమం భారత్ జోడో పాదయాత్ర. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంటోంది. ఏదో సాదాసీదాగా భారత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని ముగించకుండా.. భారీగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని 21 రాజకీయపార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం టీడీపీకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్లింది. బీఆర్ఎస్ను పిలవలేదు. దీంతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎందుకు ఆహ్వానించలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జాతీయస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది భారత్ రాష్ట్ర సమితి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి పిలిచినా BRS దూరంగా ఉంది. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకున్న BRS.. BJP, కాంగ్రెస్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి BRSను ఆహ్వానించలేదని అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో BRSతో టచ్లో ఉన్న జేడీఎస్, ఆప్ పార్టీలకు కూడా కాంగ్రెస్ ఆహ్వానాలు పంపలేదు.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
తెలంగాణలో అధికార బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పుడు రాహుల్ యాత్ర ముగింపు కార్యక్రమానికి బీఆర్ఎస్ను పిలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందనే ఆలోచన కావొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అధికారం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏమౌతుందో ఇప్పుడే ఓ అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోందని అనుకుంటున్నారు. ఏతావాతా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఎటువంటి సమీకరణాలకు దారితీస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
-
Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
-
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
-
Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్స్టా, వాట్సాప్కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
-
Vaibhav Sooryavanshi Records: బేబీ బాస్ బీభత్సం.. ఒక్క తుఫాన్ ఇన్నింగ్స్ తో వైభవ్ ఖాతాలోకి చేరిన రికార్డ్స్ ఇవే.!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!