Off The Record : డీసీసీ అధ్యక్ష పదవుల్లో 42 శాతం బీసీలకు ఇస్తారా..?
- తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామక కసరత్తు
- ఇకనుంచి పార్టీలో కీలకం కాబోతున్న డీసీసీ అధ్యక్షులు
- పార్టీకి లాయలిస్ట్లు, పార్టీ కోసమే పనిచేసే వాళ్ళకు మాత్రమే పార్టీ పదవుల్లో 42 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం
- ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవుల్లో 42 శాతం బీసీలకు ఇస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టైం వచ్చిందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్న వత్తిడి పెరిగిపోతోందా? స్థానిక ఎన్నికల్లో కోటా సంగతి సరే… ముందు మీ చేతిలో ఉన్న ఆ పని సక్కంగా పూర్తిచేసి నిజాయితీగా వ్యవహరించమన్న వత్తిళ్ళు పెరిగిపోతున్నాయా? ఏ విషయంలో సోషల్ జస్టిస్ కోసం పార్టీ మీద ప్రెజర్ పెరుగుతోంది? అది అమలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఇందుకోసం 22 మంది పరిశీలకులను నియమించింది అధిష్టానం. వాళ్ళు ఇప్పటికే జిల్లాల పర్యటన మొదలుపెట్టేశారు. వీరికి తోడు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించింది. హైకమాండ్ తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం… ఇకపై పార్టీ వ్యవహారాల్లో డీసీసీ అధ్యక్షులు కీలకం కాబోతున్నారు. చివరికి పార్టీ అభ్యర్ధుల ప్రకటన విషయంలో కూడా… డీసీసీల నిర్ణయమే ఫైనల్ కాబోతోంది.
అందుకే.. లాయలిస్ట్లు, పార్టీ కోసమే పని చేసే వాళ్ళు, చేసిన వాళ్ళకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. అదే ప్రామాణికంగా పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకులకు దిశానిర్దేశం చేసిందట ఢిల్లీ నాయకత్వం. ఐతే…. ఇక్కడే మరో ఆసక్తికరమైన, అతి ముఖ్యమైన చర్చ మొదలైంది కాంగ్రెస్ సర్కిల్స్లో. పార్టీ ఇప్పటికే సామాజిక న్యాయం మీద ఫోకస్ పెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. పార్టీ పదవుల్లో కూడా 42 శాతం బీసీలకు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి రాకపోతే… కాంగ్రెస్ ఇచ్చే టిక్కెట్లలో 42 శాతం బీసీలకు కేటాయించాలన్న అంశాన్ని కూడా చర్చించింది నాయకత్వం.
Also Read
ఆ క్రమంలోనే.. ఇప్పుడు జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది కాబట్టి… డీసీసీ అధ్యక్ష పదవుల్లో కూడా బీసీలకు 42 శాతం ఇస్తారా..? లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఆ లెక్క ప్రకారం ఎన్ని జిల్లాలకు బీసీలను అధ్యక్షులుగా నియమిస్తారన్నది ఇప్పడు ఇటు పార్టీ, అటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే అధ్యక్ష పదవులు మినహా మిగిలిన పోస్ట్లకు సంబంధించిన కూర్పు ఫైనలైంది. దీంతో… డీసీసీల్లో ఇప్పుడు ఏ మాత్రం సామాజిక న్యాయం పాటిస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. పార్టీ వేస్తున్న కమిటీల్లో కూడా 42 శాతం బీసీలే ఉండేలా చర్యలు తీసుకుంటారా..? లేదంటే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు… లాయలిస్టులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వ్యవహారం కోర్టుల్లో క్లియర్ అవకుంటే…. పార్టీ తరుపున అమలు చేస్తాం అని చెప్పిన క్రమంలో… అంతకంటే ముందు డీసీసీల్లో అమలు చేసి చిత్తశుద్ది చాటుకోవాలన్న వత్తిడి పెరుగుతోంది. దీంతో…కాంగ్రెస్ పెద్దల నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా.
- Tags
తాజావార్తలు
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
-
Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
-
Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
-
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!