Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
- మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
- ప్రహసనంగా మారిందంటూ పెదవి విరుపులు
- శిక్షణ ఎవరికి ఇవ్వాలో నో క్లారిటీ
- తూతూ మంత్రంగా ముగిసిపోయిన మండల స్థాయి శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కమలం పార్టీలో ఓ కార్యక్రమం మొక్కుబడి తంతుగా నడిచిపోతోందా? ఎవరు, ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో కూడా క్లారిటీ లేకుండా… ఏదో పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మేం గుడ్డెద్దు చేలో పడ్డట్టు నిర్వహిస్తున్నామని పార్టీ నేతలే అంటున్నారా? ఇంకా మాట్లాడితే… ఆ ప్రోగ్రామ్ని రాష్ట్ర నేతలు చాలామంది శిక్షగా భావిస్తున్నారా? అంతలా ఇబ్బంది పెడుతున్న ఆ కార్యక్రమం ఏది? ఎందుకు మమ అనిపిస్తున్నారు? దేశ వ్యాప్తంగా మెగా ట్రైనింగ్ కాంపెయిన్ నిర్వహిస్తోంది కమలం పార్టీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ…. ట్రైనింగ్ మెగా కాంపెయిన్ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే… తెలంగాణలో కూడా నడుస్తున్నాయి. కానీ… వీటివల్ల ఎవరికి, ఎంత లాభం అన్నది ప్రశ్నార్థకంగా ఉందట. అసలు ఈ ప్రక్రియ ఎంత సీరియస్ సాగుతోందన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. వీటిపై రాష్ట్ర నాయకులు చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇదొక ప్రహసనంగా మారిందని, దీని వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదనే అంటున్నట్టు తెలుస్తోంది. ముందసలు శిక్షణ ఎవరికి ఇవ్వాలనే దానిపైనే క్లారిటీ లేదట.
Also Read
చాలా చోట్ల ఇప్పటికీ… కింది స్థాయి కమిటీలే వేయలేదు, ఇక పిలిస్తే వచ్చేదెవరని అంటున్నట్టు సమాచారం. ఇప్పటికే మండల స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. వాటిని నిర్వహించిన తీరు పై విమర్శలు వస్తున్నాయి. వ్యవహారం మొత్తం తూతూ మంత్రంగా జరిగిపోయిందని అంటున్నారు. ఆ శిక్షణ తరగతులు ఎలా జరిగాయన్న దానిపై రిపోర్ట్ కావాలని రాష్ర్ట ఇన్చార్జి అభయ్ పాటిల్ ఆదేశించారు కూడా. కానీ… కొన్ని చోట్ల సంఖ్య కోసం పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేని ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అసలీ శిక్షణ తరగతులు ఓ శిక్షగా మారాయన్న గుసగుసలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక త్వరలో జిల్లా స్థాయి ప్రశిక్షణ వర్గలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ…చాలా జిల్లాల్లో ఇప్పటికీ అనుబంధ మోర్చా కమిటీలు కూడా పడలేదు. అసలు ఆ కమిటీల్లో ఎవరికి అవకాశం వస్తుందో కూడా తెలియదు. దీంతో… ఎలాంటి బాధ్యతలు లేకుండా… శిక్షణా తరగతులకు పిలిస్తే ఎవరొస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా కేంద్ర పార్టీ మానిటర్ చేస్తోంది కాబట్టి… ఏదో, అలా అలా…. చేశామంటే చేశామన్నట్టు లెక్క చెప్పుకోవడం కోసం రాష్ట్రంలో మొక్కుబడి కార్యక్రమం నడుస్తోందని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. సీరియస్గా కాకుండా…కేవలం టిక్కు పెట్టించుకోవడం కోసమే శిక్షణా తరగతులు నడుస్తున్నాయన్నది పార్టీ ఇంటర్నల్ ఒపీనియన్.
- Tags
- bjp
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!