Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Pemmasani Chandrashekar

Off The Record : రాజధాని విషయంలో మంత్రి నారాయణ రోల్ తగ్గించేస్తున్నారా.. ?

Published Date :November 29, 2025 , 7:58 pm
By Gogikar Sai Krishna
  • 2014 నుంచి అమరావతి పనుల్లో కీలకంగా నారాయణ
  • అమరావతి స్పెషల్‌ మినిస్టర్‌ అంటూ కొందరి చమత్కారాలు
  • త్రిసభ్య కమిటీ పేరుతో పెమ్మసాని ఎంట్రీపై రకరకాల అనుమానాలు
  • వచ్చీ రావడంతోనే దూకుడుగా కేంద్ర మంత్రి మీటింగ్స్‌
Off The Record :  రాజధాని విషయంలో మంత్రి నారాయణ రోల్ తగ్గించేస్తున్నారా.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరావతి వ్యవహారాల్లో మున్సిపల్‌ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్‌ చేయడం ఆయనవల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదికి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్‌ మినిస్టర్‌కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్‌. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం సంగతి ఓకేగానీ… కమిటీ కూర్పు గురించే కొత్త డౌట్స్‌ వస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. మామూలుగా అయితే…2014లో భూ సమీకరణ నుంచి అమరావతి పనులు, రైతుల సమస్యల విషయంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రి నారాయణ. అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తిరిగి పవర్‌లోకి వచ్చాక రాజధానికి సంబంధించిన వ్యవహారాలన్నిటినీ ఆయనే నడిపిస్తున్నారు. ఇదంతా చూస్తూ… అమరావతి స్పెషల్‌ మినిస్టర్‌ అని నారాయణను ఉద్దేశించి చమత్కరించే వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. కానీ సడన్‌గా సీన్‌లోకి కేంద్ర మంత్రి పెమ్మసాని ఎంట్రీతో ఎక్కడో… ఏదో…. తేడా కొట్టిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, అందులో పెమ్మసాని సభ్యుడిగా ఉండటం ఒక ఎత్తయితే… కమిటీ ఏర్పాటు అయ్యీ కావడంతోనే….ఆయన దూకుడు ప్రదర్శించడం, అప్పుడే మూడు మీటింగ్స్‌ నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అంటే… రాజధాని విషయంలో నారాయణ పాత్రను మెల్లిగా తగ్గించేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి. కాస్త లోతుగా ఆలోచిస్తే… రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ఆయన వైఖరి సరిగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెమ్మసాని తెర మీదికి రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహార శైలిపై రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయనవల్లే చాలా సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది.

సీఆర్‌డీఏ అధికారులు కూడా అదే విషయం చెప్పడంతో… రాష్ట్ర మంత్రి విషయమై రైతుల్లో అసహనం పెరిగినట్టు తెలుస్తోంది. అసలు త్రిసభ్య కమిటీని నియమించడం వెనకున్న రీజన్‌ కూడా అదేనంటున్నారు. లోకల్‌ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌, లోకల్‌ ఎమ్మెల్యేగా శ్రవణ్‌, మున్సిపల్‌ మంత్రిగా నారాయణ సభ్యులు అయినందున ఇక నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పాత్రే కీలకం కావచ్చని, అందులోనూ పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా అయినందున ఆయనకే యాక్టివ్‌ రోల్‌ ఉండవచ్చన్న వాదన బలపడుతోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు పదేళ్ళుగా…. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా… వైసీపీ హయాంలో అయితే… అసలు తమ గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలో కూడా తెలియక సైలెంట్ గా ఉన్నామని, కానీ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదనగా ఉన్నారు రైతులు. పవర్‌ మారి18 నెలలైనా… సమస్యలు అలాగే ఉన్నాయని, మంత్రి నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా… తమకు ప్లాట్లు కేటాయింపుగాని, మౌలిక సదుపాయాల కల్పన విషయంలోగాని ఎలాంటి ముందడుగు పడట్లేదంటూ ఇటీవల ఓపెనైపోతున్నారు రైతులు. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సైతం సిద్ధమయ్యారు. నిజంగా అదే జరిగితే…. ఎంత పరువు తక్కువ అనుకుంటూ అలర్టయిపోయిన ప్రభుత్వ పెద్దలు ఇక ఆ ఎపిసోడ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని నిర్ణయించారట. ఆ క్రమంలోనే… స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసానికి త్రిసభ్య కమిటీలో చోటు దక్కడం ఒకఎత్తయితే….. గతానికి భిన్నంగా ఆయన ఎంట్రీతోనే… వరుస మీటింగ్స్‌తో రైతుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో…నారాయణ ఇక సైలెంట్‌గా సైడైపోతారా, రాజధాని నిర్మాణంలో కేవలం మున్సిపల్‌ మంత్రి పాత్ర వరకే పరిమితం అవుతారా చర్చలు మొదలయ్యాయి.

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

అలాగే… ఇందులో రకరకాల సామాజిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఆ పరంగా చూస్తే… ఓ సామాజికవర్గం రైతుల్ని డీల్‌ చేయడం పెమ్మసానికి తేలికవుతుందన్న వాదన సైతం ఉంది. కేంగ్ర మంత్రి కేవలం రైతుల సమస్యల పరిష్కారం వరకే పరిమితం అవుతారా? లేక భవిష్యత్‌లో కూడా రాజధాని నిర్మాణ బాధ్యతల్లో యాక్టివ్‌గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొనసాగింపు ఖాయమైతే మాత్రం నారాయణ పాత్ర నామమాత్రం కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు రాజధాని వ్యవహారాలన్నిటినీ ఒంటి చేత్తో నడిపించారు మున్సిపల్‌ మినిస్టర్‌. ఇక మీదట ఆ రోల్‌ తగ్గవచ్చని సూచిస్తున్నాయి తాజా పరిణామాలు. అలాగే… సీఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి కూడా ఈ తాజా మార్పులకు కారణం అంటున్నారు. సంస్థ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నారాయణ మీద అసంతృప్తి పెరగడానికి అది కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు. సీఆర్డీఏ అధికారులు కొంతమంది రైతులతో దురుసుగా ప్రవర్తించడం మొదటికే మోసం తెచ్చిందన్న అభిప్రాయం ఉంది. వోవరాల్‌గా ఇలాంటి రకరకాల కారణాలు కలగలిసి మున్సిపల్‌ మినిస్టర్‌ పాత్రను పరిమితం చేసి కేంద్ర మంత్రికి కీ రోల్‌ ఇచ్చాయన్నది అమరావతి టాక్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • ntv
  • OTR
  • Pemmasani Chandrashekar

తాజావార్తలు

  • Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..

  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions