OTR : కొండా సురేఖ కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2009… 2026 సేమ్ సీన్ రిపీట్ అయింది. కొండా సురేఖ కి మంత్రి పదవులు కలిసి రావడం లేదా..? అప్పుడు సీఎంతో పొసగలేదు… ఇప్పుడు సీఎంతో పొసగకనే వేటు. ఇంతకీ మంత్రి పదవులు కొండా సురేఖకు ఎందుకు అచ్చి రావడం లేదు?మరోవైపు కొండా కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా?.కొండా తప్పించినందుకు ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు ఇచ్చి బ్యాలెన్స్ చేసిందా? మాజీమంత్రి కొండా సురేఖకు మంత్రి పదవులు అచ్చిరావడం లేనట్టు కనబడుతోంది.. 2009లో రోశయ్య కేబినెట్ నుంచి కొండా సురేఖ తప్పుకున్నారు. అప్పట్లో వందరోజుల పాటు మంత్రిగా పనిచేశారు. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి వెయ్యి రోజులకు బర్తరఫ్ వేటుపడింది. మొదట వైయస్ రాజశేఖర్ రెడ్డి కోసం… ఇప్పుడు తన కూతురు చేసిన వ్యాఖ్యలతో పార్టీ క్రమశిక్షణ చర్యల కి కొండా సురేఖ మంత్రి పదవి పోయింది.
2009లో వైఎస్ మరణం తర్వాత రోశయ్య కేబినెట్లో తిరుగుబాటు నేతగా వ్యవహరించారు. జగన్ కోటరీ లో ఉంటూ… రోశయ్యని ముఖ్యమంత్రిగా చూడలేమని… ఆ కేబినెట్ లో కొనసాగలేమంటూ నేరుగా గవర్నర్ వద్దకే వెళ్లి రాజీనామాను సమర్పించారు కొండ సురేఖ. దీంతో 2009 మే 25న ప్రమాణం చేసిన సురేఖ..సరిగ్గా 100 రోజులకే పదవికి గుడ్బై చెప్పారు. ప్రస్తుతం వెయ్యి రోజుల రేవంత్ కేబినెట్ లో తమ పదవి నుంచి బర్తరఫ్ చేశారు.గతంలో మాదిరిగా ప్రస్తుతం విభాగాలు ఏమీ లేకపోయినా… కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్లకు కారణమయ్యాయి. మొదటిసారి సీఎంపై మాట్లాడిన సందర్భంలోనే కొంత పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. కానీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు సయోధ్య కుదిరించారు. కానీ ఇప్పుడు సీఎంని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో… పార్టీ నాయకత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డికి బాసటగా నిలబడింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తల్లి మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అందుకే… కొండా సురేఖ వివాదాలకు దూరంగా ఉన్న… కూతురు రూపంలో వివాదం వచ్చి పడింది. దీనికి మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది.
Also Read
మరోవైపు కొండా సురేఖ కులం కార్డును తెలివిగా అడ్డుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తాను బీసీ మహిళనని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చి… కొండా కులం కార్డుకు కౌంటర్ ఇచ్చింది హైకమాండ్. గౌడ సామాజికవర్గానికి చెందిన నేరెళ్ల శారదకి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది. అలాగే.. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్పర్సన్ నియమించింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది. కొండా మురళి, కొండా సురేఖ సామాజిక వర్గాలతోపాటు మరో గౌడ కమ్యూనిటీకి చెందిన మహిళకు కూడా పదవులు ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!