Off The Record : జూబ్లీహిల్స్ లో హిందుత్వ అజెండాతో బీజేపీ
- జూబ్లీహిల్స్లో హిందుత్వ అజెండాతో బీజేపీ
- నియోజకవర్గంలో లక్షా 30వేలకు పైగా ముస్లిం ఓట్లు
- హిందూ ఓట్లను సాలిడ్ చేసుకోవాలన్న ఎత్తుగడలో బీజేపీ
- రేవంత్రెడ్డి రేవంతుద్దీన్గా మారాడన్న రాంచందర్రావు
- టోపీ పెట్టుకోవాల్సివస్తే తల నరుక్కుంటానన్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్లో బీజేపీ సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు వెళ్తోందా? అదే అంశం మీద ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోందా? దాని గురించే గట్టిగా చెప్పగలిగితే… ఓ వర్గం ఓట్లు సాలిడ్ అవుతాయని కాషాయ దళం లెక్కలేస్తోందా? ఇంతకీ ఉప ఎన్నిక బరిలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఓట్ల వేటలో పార్టీ ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్కు చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోంది. కలిసి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వాడుకుంటున్నాయి అన్ని ప్రధాన రాజకీయపక్షాలు. ఇందులో భాగంగానే…తన బ్రాండ్ అయిన హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్తోంది బీజేపీ. జరుగుతోంది ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక అయినా… ఇక్కడ కూడా హిందుత్వం ,జాతీయ వాదాల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కాషాయ నాయకులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్ల ప్రభావం ఎక్కువ. దాదాపు లక్షా 30వేల వరకు ఉన్నాయి. దాంతో… హిందువుల్ని సాలిడ్గా తమవైపు తిప్పుకోవాలన్న ప్రణాళికతో ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
సీనియర్స్ సహా…. ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నాయకులంతా మత పరమైన అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలన్నీ హిందూ, ముస్లిం అన్న వ్యవహారాల చుట్టూనే తిరుగుతున్నాయి. ముస్లిం ఓట్ల కోసం సీఎం రేవంత్రెడ్డి రేవంతుద్దీన్గా మారారంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే… ఇంకో అడుగు ముందుకేసి ముస్లిం టోపీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే… తల నరుక్కుంటానుగానీ… ఆ టోపీ మాత్రం పెట్టుకోబోనని అన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న లక్ష ఓట్ల కోసం అంత చేస్తున్న మీకు మూడు లక్షల మంది హిందువుల ఓట్లు వద్దా అని అన్నారు పార్టీ నాయకురాలు డీకే అరుణ.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఇజ్జత్ అయితే…. మరి హిందువులు ఏంటని ప్రశ్నించారు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు వద్దా అని అడుగుతున్నారాయన. ఇలా… హిందూ ఓట్ల సెంట్రిక్గా ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఆ రకంగా హిందువుల ఓట్లను వీలైనంత ఎక్కువగా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలేనని చెబుతూ తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తం మీద హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ చేస్తున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సర్వే అంచనాలకు భిన్నంగా కాషాయ దళం అద్భుతమైన పనితీరు ప్రదర్శించగలుగుతుందా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!