Off The Record: డీసీసీల నియామకంతో వైరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీల నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య వైరం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏడు జిల్లాలపై మొదలైన కుస్తీ.. కత్తులు దూసుకునేలా మారింది. ఆ ఏడింటిని ఎందుకు ఆపారు? ఆ ఏడు DCCల విషయంలో ఏం జరిగింది?
సమన్వయ లోపంతో ఏడుచోట్ల డీసీసీల ప్రకటనకు బ్రేక్
పీసీసీ కమిటీల ప్రకటన సమయంలో తెలంగాణలోని 26 జిల్లాలకు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. ఏడింటిని వాయిదా వేసింది. ఇటీవల సీనియర్ల భేటీ తర్వాత మీడియా ముందుకు వచ్చిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి.. ఆపిన ఆ ఏడు డీసీసీల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ గెలిచిన చోట అధ్యక్షుల నియామకం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు ఉత్తమ్. సీనియర్లు.. పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సమన్వయ లోపంతోనే డీసీసీల నియామకం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. ఎవరికివారు తమ నాయకుడిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలని పట్టుబట్టడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
సికింద్రాబాద్ డీసీసీపై పీటముడి
సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్, ఉత్తమ్ మధ్య పోటీ ఉంది. సికింద్రాబాద్ జిల్లా పార్టీ పగ్గాలను మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అనిల్కు ఇవ్వాలని రేవంత్ చూస్తుండగా.. పార్టీ నేత ఆడెం సంతోష్కు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేయడంతో పీటముడి పడింది. అంజన్ కుమార్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా.. ఆయన కుమారుడు అనిల్కు డీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. జనగామ డీసీసీ విషయంలో మూడు ముక్కలాట సాగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఒకరి పేరును సూచిస్తే.. జంగా రాఘవరెడ్డి కోసం ఉత్తమ్.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డికి రేవంత్ మద్దతుగా నిలిచారు. ముగ్గురు పార్టీలో కీలక నేతలు కావడంతో ప్రకటన కొలిక్కి రాలేదు.
సికింద్రాబాద్కు సూర్యాపేటకు లంకె ..?
భూపాలపల్లిలో కూడా మాజీ మంత్రి శ్రీధర్బాబు పీసీసీ చీఫ్ల మధ్య పోటీతో డీసీసీ ప్రకటన వాయిదా పడిందట. అధ్యక్ష పదవిని ప్రకాష్రెడ్డికి ఇవ్వాలని సూచించారు శ్రీధర్బాబు. అయితే ఇక్కడ గండ్ర సత్యనారాయణకి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారట. ఆ హామీతోనే గండ్రను కాంగ్రెస్లో చేర్చుకున్నట్టు రేవంత్ వర్గం చెబుతోంది. అయితే శ్రీధర్బాబు మెట్టుదిగకపోవడంతో భూపాలపల్లి పెండింగ్లో పడింది. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వెంకన్నను కొనసాగించాలని ఉత్తమ్తోపాటు మాజీమంత్రి దామోదరరెడ్డి సూచించారు. సికింద్రాబాద్ డిసిసి విషయంలోఉత్తమ్ అడ్డుపడ్డారని.. సూర్యాపేటను రేవంత్ ఆపినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో రేవంత్పై దామోదర్రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. రేవంత్, ఉత్తమ్ వార్ మధ్యలో ఇబ్బంది పడుతున్నారట దామోదర్రెడ్డి.
సంగారెడ్డిలోనూ నేతల తకరారు
సంగారెడ్డి డిసిసి చీఫ్గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల పనిచేశారు. మళ్లీ నిర్మలనే కొనసాగించాలని జగ్గారెడ్డితోపాటు దామోదర రాజనర్సింహ కోరారట. అయితే పీసీసీ మాత్రం గత ఎన్నికల్లో పటాన్చెరు నుంచి పోటీ చేసిన కాట శ్రీనివాసగౌడ్కు జిల్లా పార్టీ బాధ్యతలు ఇవ్వాలని రేవంత్ భావించారట. దాంతో సంగారెడ్డి విషయంలోనూ వర్గపోరు కీలకంగా మారింది. ఇప్పటికే సీనియర్ల పంచాయితీ కాక మీద ఉన్న సమయంలో ఏడు డీసీసీల అంశాన్ని నాన్చుతారో… తేల్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?