Off The Record: సుహాసిని ఏ పార్టీలో చేరతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు నందమూరి వారసురాలిపై ఫోకస్ పెట్టాయా? కుటుంబ పార్టీని వీడబోతున్నారనే చర్చలో వాస్తవమెంత? ఏ పార్టీ ఆమెతో టచ్లో ఉంది? ఇప్పుడెందుకు ఈ ప్రచారం జరుగుతోంది?
Also Read
గత ఎన్నికల్లో కూకట్పల్లిలో పోటీ.. ఓటమి
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ జట్టుకట్టి పోరాటం చేశాయి. అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగింది. అప్పుడే టీడీపీలోకి వచ్చిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. ఆ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు సుహాసిని. ఆ సీటులో గులాబీ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు మళ్లీ గెలిచారు. ఆ ఎన్నికల్లో ఓడినా సుహాసిని టీడీపీ కార్యక్రమాల్లో కొన్నాళ్లు యాక్టివ్గానే పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఆమె ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సుహాసిని టీడీపీ నుంచి పోటీ చేస్తారా? లేక ఇంకేదైనా రాజకీయ మార్పులు ఉంటాయా అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ మొదలైంది.
టీడీపీ నుంచే పోటీ చేస్తారని కొందరి వాదన
టీడీపీ నందమూరి-నారా కుటుంబ పార్టీ. ఆ కుటుంబం నుంచి వచ్చిన సుహాసిని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. అయితే అదే తెలుగుదేశం పార్టీ శిబిరంలో మరో వాదన వినిపిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి కాకుండా వేరే నియెజకవర్గంపై నజర్ పెడతారా అనే చర్చ కూడా ఉంది. వివిధ కారణాలతో తెలంగాణ టీడీపీలో సుహాసిని యాక్టివ్గా లేరని ప్రచారం జరుగుతోంది. దాంతో నందమూరి తనయ రాజకీయ అడుగులు ప్రస్తుతం చర్చల్లోకి వస్తున్నాయి.
సుహాసినితో టచ్లోకి వెళ్లిన ఓ పార్టీ?
సుహాసినితో ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. కమ్మ సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న ఆ పార్టీ.. సుహాసినితో టచ్లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం కూడా పలికారట. కండువా మారిస్తే తమ శిబిరంలో రాజకీయ భవిష్యత్కు ఢోకా ఉండబోదని చెప్పినట్టు సమాచారం. అయితే ఆ ఆఫర్కు సుహాసిని బదులివ్వలేదని తెలుస్తోంది. ప్రతిపాదనలు పెట్టిన పార్టీ సైతం సుహాసిని రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తోందట. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని చూసి.. తప్పకుండా మెరుగైన రాజకీయ భవిష్యత్ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నారట.
సుహాసినితో టచ్లో ఉన్న ఆ పార్టీ ఏంటి?
నందమూరి సుహాసినితో సంప్రదింపులు జరిపిన పార్టీ ఏంటి? అధికారపార్టీ నుంచి అయితే ఎవరు ఆమెతో మాట్లాడారు? ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానాలు వెళ్లి ఉంటే .. సమీకరణాలు ఎలా ఉంటాయి? కమ్మ సామాజికవర్గం ఓట్లను గురిపెట్టిన పార్టీ ఏంటని ఆరా తీస్తున్నారట. మరి.. సుహాసిని విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం వాస్తవమో కాదో కాలమే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఏదైనా జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!