Off The Record: ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీలో ప్రస్తుతం చర్చంతా ఆ లీడర్ గురించే. పార్టీ వ్యవహరాల్లో కీలకంగా ఉన్న ఆ నాయకుడి వల్లే.. ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్న చర్చ నడుస్తోందట. ఇది అనుకోకుండా జరుగుతోందా.. లేక కావాలని చేస్తున్నారా అనేది అంతు చిక్కడం లేదట. ఇంతకీ టీడీపీలో చర్చగా మారిన ఆ నేత ఎవరు? ఆయనేం చేస్తున్నారు?
విమర్శలకు కేంద్రంగా మారుతున్నారా?
అచ్చెన్నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో అచ్చెన్న పాత్ర లేకుండా ఏదీ జరగదనే భావన దాదాపుగా ఏర్పడింది. అయితే తక్కువ టైమ్లోనే కీలక పొజిషన్కు ఎలా చేరారో.. అంతేస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అచ్చెన్నాయుడు.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
పాదయాత్రలో పోలీసులపై కామెంట్స్
గతంలో టీడీపీ గురించి ఓ లీడర్తో అచ్చెన్న కామెంట్ చేసింది మొదలు.. వివిధ సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీలకు.. సోషల్ మీడియాకు ఈజీగా దొరికిపోతున్నారనే చర్చ సాగుతోంది. ఒకటికి రెండు సందర్భాల్లో టీడీపీపై అచ్చెన్న చేసిన కామెంట్స్ పార్టీని ఇరుకున పెట్టాయి కూడా. తన పేరు లేకుండానే ప్రెస్నోట్ ఇచ్చేశారని అసెంబ్లీ కమిటీకి సమాధానం ఇచ్చారు. ఇటీవల పాదయాత్రలో పోలీసులను ఉద్దేశించిన వ్యాఖ్యలు.. ఒకటి రెండు సందర్భాల్లో అధికారంలోకి వచ్చినా అధినేతను నమ్మలేం అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా పార్టీ నేత చేస్తున్న పాదయాత్రకు చిత్తూరు పట్టణంలో లభించిన ఆదరణపై టీడీపీలోనే చర్చ ఉంది. దాని మీద పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు పడింది టీడీపీ అధిష్ఠానం.
పాదయాత్రపై టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వైరల్
అచ్చెన్న కారణంగా చిత్తూరు వ్యవహారం కూడా బయటకు వచ్చిందని టీడీపీలో లేటెస్ట్ టాక్. ఏపీ టీడీపీ చీఫ్ హోదాలో ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాదయాత్ర ఫెయిల్యూర్ బాటలో ఉందన్న వైసీపీ విమర్శలకు మరింత బలం చేకూరేలా అచ్చెన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారనేది ఆ చర్చ సారాంశం. ఆ టెలీకాన్ఫరెన్స్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాదయాత్రలో పాల్గొంటున్న నేతతోపాటు పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందనే వాదన వినిపిస్తోందట. పార్టీ అధినాయకత్వం నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్సులు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అచ్చెన్న టెలికాన్ఫరెన్స్ ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చిందనేది ప్రశ్న. ఇది బయట వ్యక్తుల పనా.. లేక ఇంటి దొంగల కుట్ర అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న వ్యవహార శైలి.. గతంలో బయటకొచ్చిన ఆయన ఆడియో.. వీడియో క్లిప్పులు.. ఆయన చేసిన కామెంట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో ప్రస్తావిస్తూ.. వాటికీ వీటికి ఏదైనా లింక్ ఉందా అని ప్రశ్నిస్తున్నారట.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!