Off The Record: ఆ వైసీపీ ఎమ్మెల్సీ కూటమికి దగ్గరవుతున్నారా..?
- తోట త్రిమూర్తులు కూటమికి దగ్గరవుతున్నారా?..
- మనిషి ఒక చోట, మనసు మరో చోట ఉందా?..
- వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు..
- జనసేన మినహా అన్ని పార్టీలు తిరిగేసిన తోట..
- జిల్లా పరిషత్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా హాజరు..
- అసెంబ్లీ సమావేశాల్లో పవన్తో ప్రేమగా, ప్రత్యేకంగా ఫోటో సెషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ… తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు? మనిషి ఒకచోట మనసు మరో చోట అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా అని మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తోట త్రిమూర్తులు అంటే… గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కూడా నాకు ముందు కులం ముఖ్యం, తర్వాతే రాజకీయం అంటూ ఏ మాత్రం దాచుకోకుండా పలు సందర్భాల్లో చెప్పారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా, గత వైసిపి ప్రభుత్వ హయాం నుంచి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారాయన. ఇప్పటి వరకు తెలుగుదేశం… ప్రజారాజ్యం… కాంగ్రెస్… వైసీపీ ఇలా చాలా పార్టీల్లో తిరిగారు తోట. ఇక జనసేనలో చేరతారని 2014 ఎన్నికల నుంచి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి గానీ…. ఆ ఒక్కటీ జరగడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు ఒకేసారి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అప్పటినుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఊాగానాలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడుగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. కానీ…జిల్లా నుంచి అమరావతికి వెళ్ళేసరికి ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట గమనిస్తున్న వాళ్ళకు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఫోటో సెషన్స్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా ప్రత్యేకంగా ఫోటో దిగటం చర్చనీయాంశంగా అయింది. అదే సమయంలో అటు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియడంతో… ఆయనను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి శాసనమండలిలో అధికార పార్టీ సభ్యుడిని కొనసాగించాలని కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోందంటున్నారు.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ, అటు టిడిపిలోనూ గందరగోళానికి దారి తీశాయి. శాసనమండలిలో ఇరు వర్గాల ఎమ్మెల్సీలు త్రిమూర్తులు వ్యవహార శైలికి అవాక్కయ్యారట. ఇప్పటికే ఐదుగురు వైసిపి ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోతోంది. తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పటికప్పుడు తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!