Off The Record: ఆ వైసీపీ ఎమ్మెల్సీ కూటమికి దగ్గరవుతున్నారా..?
- తోట త్రిమూర్తులు కూటమికి దగ్గరవుతున్నారా?..
- మనిషి ఒక చోట, మనసు మరో చోట ఉందా?..
- వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు..
- జనసేన మినహా అన్ని పార్టీలు తిరిగేసిన తోట..
- జిల్లా పరిషత్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా హాజరు..
- అసెంబ్లీ సమావేశాల్లో పవన్తో ప్రేమగా, ప్రత్యేకంగా ఫోటో సెషన్..
Off The Record: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ… తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు? మనిషి ఒకచోట మనసు మరో చోట అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా అని మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తోట త్రిమూర్తులు అంటే… గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కూడా నాకు ముందు కులం ముఖ్యం, తర్వాతే రాజకీయం అంటూ ఏ మాత్రం దాచుకోకుండా పలు సందర్భాల్లో చెప్పారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా, గత వైసిపి ప్రభుత్వ హయాం నుంచి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారాయన. ఇప్పటి వరకు తెలుగుదేశం… ప్రజారాజ్యం… కాంగ్రెస్… వైసీపీ ఇలా చాలా పార్టీల్లో తిరిగారు తోట. ఇక జనసేనలో చేరతారని 2014 ఎన్నికల నుంచి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి గానీ…. ఆ ఒక్కటీ జరగడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు ఒకేసారి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అప్పటినుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఊాగానాలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడుగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. కానీ…జిల్లా నుంచి అమరావతికి వెళ్ళేసరికి ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట గమనిస్తున్న వాళ్ళకు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఫోటో సెషన్స్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా ప్రత్యేకంగా ఫోటో దిగటం చర్చనీయాంశంగా అయింది. అదే సమయంలో అటు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియడంతో… ఆయనను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి శాసనమండలిలో అధికార పార్టీ సభ్యుడిని కొనసాగించాలని కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోందంటున్నారు.
తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ, అటు టిడిపిలోనూ గందరగోళానికి దారి తీశాయి. శాసనమండలిలో ఇరు వర్గాల ఎమ్మెల్సీలు త్రిమూర్తులు వ్యవహార శైలికి అవాక్కయ్యారట. ఇప్పటికే ఐదుగురు వైసిపి ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోతోంది. తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పటికప్పుడు తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
-
Yash : గోవాలో తండ్రీకొడుకుల పగ: ‘టాక్సిక్’ కథ లీక్ చేసిన యశ్
-
Electric Scooters: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Air India Crisis: రూ.22 వేల కోట్ల నష్టంలో ఎయిర్ ఇండియా.. టాటా బాస్తో సింగపూర్ ఎయిర్లైన్స్ CEO రెస్క్యూ మీటింగ్!
ట్రెండింగ్
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!