Off The Record: అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?
- ఎల్లుండి తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్..
- మూడు ఖాళీల్లో ఒకటి అజార్తో భర్తీ..
- ఉన్నఫళంగా ఈ నిర్ణయం ఏంటన్న చర్చ..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోణం ఉందా?..
- జూబ్లీహిల్స్లో లక్షకు పైగా ముస్లిం ఓటర్లు..
- ఇటీవల తమ ప్రాధాన్యాన్ని ప్రశ్నించిన మత పెద్దలు..
- రెండేళ్ళయినా మైనార్టీ మంత్రి లేడంటూ నిలదీత..
- సీఎం రేవంత్ ప్రతిపాదనకు అధిష్టానం స్పాట్ అప్రూవల్?..
- జూబ్లీహిల్స్ పిచ్ మీద అజార్ బ్యాటింగ్ ఎలా ఉండబోతోంది?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్ రెడ్డి టీమ్లో చేరబోతున్నారు అజార్. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్కు క్లియర్ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్. ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు ఉన్నఫళంగా, ఉరుములేని పిడుగులా… కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం చాలామంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కానీ… ఆ పనిని మాత్రం అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది హైకమాండ్. పైగా మూడు ఖాళీలు ఉంటే… రెండిటిని వదిలేసి ఇప్పటికిప్పుడు అజార్తో ఒకదాన్ని భర్తీ చేయడం వెనక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోణం ఉందని అనుమానిస్తున్నాయి రాజకీయవర్గాలు.
ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. లక్షకు పైగా ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెద్దలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సందర్భంగా… ముస్లిం మత పెద్దలతో జరిపిన సమావేశాల్లో పార్టీ… మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించిన అంశం చర్చకు వచ్చిందట. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా…తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ సందర్భంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ప్రత్యేకించి కేబినెట్ బెర్త్ గురించే నిలదీశారట ముస్లిం పెద్దలు.ఇదే అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే లైన్ క్లియర్ చేయించుకున్నట్టు చెబుతున్నారు.ఇటీవల ఓ మైనార్టీ నేత ఇంటికి వెళ్లిన సందర్భంగా కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సంచారం. అందుకే విషయ తీవ్రతను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళారట సీఎం. ఆ క్రమంలోనే స్పాట్ అప్రూవల్ వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రేవంత్ ప్రతిపాదనపై పెద్దగా నాన్చకుండా ఓకే చేసేసిందట. కారణం ఏదైనాగానీ…. దాదాపు రెండేళ్ళ నిరీక్షణ తర్వాత మైనార్టీ కోటాలో అజారుద్దీన్ సిక్స్ కొట్టేశారు. మరిప్పుడు ఆయనతో జూబ్లీహిల్స్ పిచ్ మీద పార్టీ పెద్దలు ఎలా బ్యాటింగ్ చేయిస్తారో, ఆయన ఎలా చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!