Off The Record: జగన్ అడ్డాలో టీడీపీలో ఆధిపత్యపోరు..!
- పులివెందుల టీడీపీలో రచ్చ రచ్చ..
- మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ..
- బెరైటీస్ అక్రమ రవాణాపై సీఎంకు రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు..
- పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఏకరువు పెట్టిన ఎమ్మెల్సీ..
- బీటెక్ రవి అనుచరుల దందాపై ఫిర్యాదుల వెల్లువ..
- ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మధ్య ముదురుతున్న వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పులివెందుల. ఈ నియోజకవర్గం పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైయస్ కుటుంబం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం అక్కడ టిడిపి నేతల కుమ్ములాటలు కూడా మామూలుగా లేవు. ఓవర్గం అవినీతిని ప్రోత్సహిస్తే….మరో వర్గం తాము అవినీతికి వ్యతిరేకం అంటూ ఫిర్యాదులకు తెరలేపారు. తొండూరు మండలంలో విద్యా కమిటీ ఎన్నికల్లో తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక వర్గానికి చెందిన నేతల చిన్నచిన్న చెట్లను మరో వర్గం నరికేస్తే…అందుకు తామేమి తీసిపోమంటూ మరో వర్గం ఏకంగా కార్లతో ఢీకొట్టి, రాడ్లతో చితకబాది హత్య చేయడానికి ప్రయత్నించారట. ఇద్దరూ ప్రత్యర్థి పార్టీలేం కాదు..ఒకే పార్టీకి చెందిన నేతలే. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన తెలుగు తమ్ముళ్లు, తమను పోలీసులు కొట్టారంటూ కోర్టులో జడ్జీలకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఆధిపత్యంపై అక్కడ పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
Read Also: AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
Also Read
పులివెందుల టిడిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యవహరిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తమ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతున్నారట… మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో వేముల మండలంలో ఓ టిడిపి నేత తెగించారన్న చర్చ జరుగుతోంది. కోర్టు కేసులో ఉన్న పది కోట్ల విలువ చేసే ముగ్గురాయిని రాత్రికి రాత్రి తరలించేశారట. అక్రమ మైనింగ్పై రగిలిపోయారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. అంతేకాకుండా జిలెటిన్ స్టిక్స్ అక్రమంగా నిలువు చేసి ముగ్గురాయి గనుల్లో ఉపయోగించడం వల్ల అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారట. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో విస్తారంగా ముగ్గురాయి గనులు ఉన్నాయి.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ తవ్వకాలు ఎక్కువయ్యాయట. ప్రతిరోజు దాదాపు 100 లారీల ముగ్గురాయి ఇక్కడి నుంచి తరలిపోతోందంటే ఏ మేర అక్రమ మైనింగ్ జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా టిడిపి నేతల కనుసన్నల్లోనే జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ముగ్గురాయి అక్రమ రవాణా పై ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయడంతో, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య పోరు ఘర్షణలకు దారితీస్తోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా తాము తగ్గేదేలే అంటున్నారట మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు. అవినీతి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటున్నారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులు. ఇలా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి. పులివెందులలో టిడిపి మీటింగ్ పెట్టాలంటే జిల్లా ఇన్చార్జి మంత్రి సైతం వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇరు వర్గాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తలపడతాయోనన్నా ఆందోళన నెలకొంది. పులివెందుల నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదానికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!