Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ap Bjp Mlas Silent In Assembly Reasons Behind Lack Of Debate And Reactions

Off The Record: అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు స్వరం ఎందుకు వినిపించలేదు..?

Published Date :March 7, 2026 , 9:30 pm
By Sudhakar Ravula
  • సభలో గట్టిగా మాట్లాడదామని బీజేఎల్పీలో నిర్ణయం..
  • మిత్రపక్షాన్ని నొప్పించకుండానే మనం ఉనికి చాటుకుందామని డిసైడ్‌..
  • సభలోకి వచ్చేసరికి బీజేపీ సభ్యులు ఎందుకు కామ్‌గా ఉన్నారు?..
  • ఎమ్మెల్యేల వైఖరిపై బీజేపీ కేడర్‌లో సైతం సెటైర్స్‌..
  • కూటమి ధర్మం కాషాయ ఎమ్మెల్యేల నోరు కట్టేసిందా?..
  • సపోర్ట్‌ ఓకే.. మన ఉనికి కూడా తెలియాలికదా అంటున్న కేడర్‌..
  • ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందోనన్న భయం ఉందా?..
Off The Record: అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు స్వరం ఎందుకు వినిపించలేదు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఏపీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకరు మంత్రి కూడా. అంతా కలిసి అసెంబ్లీ సమావేశాలకు ముందు చాలా మాట్లాడుకున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలతో పాటు ఇతర అంశాల మీద కూడా గట్టిగా రియాక్ట్‌ అవుదామని డిసైడ్‌ అయ్యారు. మనం కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి…. మిత్రపక్షాన్ని నొప్పించకుండానే… మన ఉనికి చాటుకుందామని నిర్ణయం తీసుకున్నారట. ప్రధానంగా… రాష్ట్రంలో మనం ఎవరికీ తోకలం కాదు, మనది ప్రజాపక్షం అని బయటికి చెప్పాలనుకున్నట్టు సమాచారం. అంతవరకు బాగానే ఉందిగానీ… ఆ తర్వాత ఏమైందన్నదే మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. బీజేఎల్పీలో మాట్లాడుకున్న మాటలన్నీ ఏమైపోయాయి? కాషాయ సభ్యులు అసెంబ్లీలో ఎందుకు సరిగా మాట్లాడలేకపోయారంటూ చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. ఇవి బడ్జెట్‌ సమావేశాలు కాబట్టి… సమస్యల గురించి తర్వాత చూద్దామని మనోళ్ళు అనుకున్నారా ఏంటి అంటూ… కమలం కార్యకర్తలే జోకులేసుకుంటున్నారట. ప్రజల పక్షంగా ఉండాలనుకున్నప్పుడు సభలో కనీసమాత్రమైనా స్పందించాలి కదా, మాట్లాడాలికదా…? కొంత మంది టీడీపీ సభ్యులే ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తున్నప్పుడు మనోళ్లు మౌనంగా ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు వీళ్ళేమనుకుంటున్నారంటూ బీజేపీ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చలే నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఇంకో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. టీడీపీ సభ్యులు మాట్లాడారంటే వాళ్ళ లెక్కలు వేరుగా ఉంటాయి. వాళ్ళలో వాళ్లు ఎన్నయినా అనుకుంటారు, ఏమైనా మాట్లాడి తర్వాత ప్యాచప్‌ చేసుకుంటారు. మనం పొరుగింటి వాళ్ళం కదా…., మన లిమిట్స్‌ ఏవో తెలుసుకుని మెలగాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ శాసనసభ్యులు సైలెంట్‌ అయిఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. కూటమి ధర్మం వాళ్ళ నోళ్లు కట్టేసి ఉండవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మరో 15 ఏళ్ళ పాటు కూటమిలో ఎలాంటి గొడవ లేకుండా కలిసుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ జనసేనాని పవన్‌కళ్యాణ్‌ చెబుతున్న మాటల్ని వీళ్లు బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారా? అందుకే కామ్‌గా ఉన్నారా అంటూ ఇంకొందరు ప్రశ్నించుకుంటున్నారు. సభకు వెళ్ళామా, ప్రతిపాదించిన ప్రశ్న ఏదైనా వస్తే మాట్లాడామా, అదీకూడా లేకుంటే సపోర్ట్‌ పేరిట సైలెంట్‌గా ఉన్నామా అన్నట్టుండి చర్చల్ని వదిలేస్తే… మన ఉనికి తెలియాలి కదా… అంటున్నారు ఏపీ బీజేపీ కార్యకర్తలు.

రాబోయే మూడేళ్ళు కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా లేక నోరు తెరిచి చర్చల్లో పాల్గొంటారా అన్న డౌట్స్‌ కూడా కేడర్‌లో పెరుగుతున్నాయట. గతంలో ప్రశ్నలతో, చర్చలతో హోరెత్తించిన విష్ణుకుమార్ రాజు కామ్ అవడంపై సొంత నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కమ్మగా ఉందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, వివరణలు ఇచ్చుకోవాల్సిరావడంతో మరో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైలెంట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడితే ఎలాంటి సమస్య వస్తుందోనన్న భయం కూడా ఉండి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్‌. ఓవరాల్‌గా ఈసారి అసెంబ్లీలో బీజేపీ సభ్యులు కామ్‌గా ఉండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంపై పార్టీ కేడర్‌ కూడా కాస్త అసహనంగా ఉందట. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు, సంయమనం పాటిస్తుండవచ్చుగాని… కనీస ఉనికి చాటుకోకుంటే ఎలాగన్నది కార్యకర్తల ప్రశ్న.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adinarayana Reddy
  • Andhra Pradesh assembly
  • Andhra Pradesh Politics
  • AP BJP MLAs
  • BJP assembly debate

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions