TRS : ఆ ఇద్దరి నేతల మధ్య మాటలు లేవా.? ఇంతకీ ఎవరా నేతలు.? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుత్త సుఖేందర్రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ జరిగిన పరిణామాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారట గుత్తా. విషయం తెలిసి ఈ ఆధిపత్యపోరులో నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారట ఉద్యోగులు.
ఎవరైనా పార్టీ కార్యకర్తలు గుత్తా ఇంటికి వెళ్లారని తెలిస్తే.. తమ ఇంటికి రావొద్దని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే భూపాల్రెడ్డి. దీంతో గుత్తా దగ్గరకు వెళ్లడం మానుకున్నారట కొందరు శ్రేణులు. ఈ మూడేళ్ల కాలంలో జిల్లా స్థాయి కార్యక్రమాలకో.. పార్టీ ముఖ్యనేతల మీటింగ్స్కో తప్ప గుత్తా, భూపాల్రెడ్డిలు కలిసి వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. దీంతో లోకల్గా ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ఎవరిని ఆహ్వానిస్తే.. ఇంకెవరికి కోపం వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ప్రొటోకాల్ పాటించకుండా ఉద్దేశపూర్వంగానే అవమానిస్తున్నారని గుత్తా మనస్తాపం చెందుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని పార్టీ స్పష్టం చేసిన విషయాన్ని మర్చిపోవద్దని భుపాల్రెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారట. వాస్తవానికి దశాబ్దాల క్రితం గుత్తా, భూపాల్రెడ్డి ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగినవారే. తర్వాతే గ్యాప్ వచ్చేసింది. ఎడముఖం పెడముఖంగా మారిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నమ్ముకొన్న కొందరు నాయకులు ఇద్దరితో సఖ్యంగా ఉంటున్నారట.
ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాప్ వల్ల నల్లగొండ టీఆర్ఎస్కు కలుగుతున్న లాభనష్టాలపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారట. ఇప్పటికే గ్రౌండ్ నుంచి పక్కా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సమస్య శ్రుతి మించకుండా ఇద్దరి మధ్య ఎప్పుడు సయోధ్య కుదుర్చుతారోనని ఎదురు చూస్తున్నారట కార్యకర్తలు. మరి.. నల్లగొండ టీఆర్ఎస్లో నువ్వా నేనా అని సాగుతున్న ఈ ఆధిపత్యపోరుకు ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!